స్వేచ్ఛారావం
(ప్రొఫెసర్ హరగోపాల్ సార్ వివిద పత్రికలల్లో రాసిన వ్యాసాలు అందుబాటులో ఉన్న మేరకు ఇక్కడ ఇస్తున్నాం. ఈ వ్యాసాలు, ఆయన అనుభవాలు ఈ తరం వారికి ఉపయోగపడతాయని అశీస్తూ...మీ డేవిడ్)
Sunday, October 28, 2012
వైవిధ్యం సరే, వైరుధ్యాల సంగతేమిటి? (18-10-2012)
హైదరాబాద్లో రెండు వారాలుగా అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు జరుగుతున్నది. మాబోటి వాళ్లకు వెళ్ళాలని కూడా అనిపించలేదు. ఈ సదస్సు కు హైదరాబాద్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సీసీఎంబీని ఆహ్వానించలేదు. దేశం గర్వించే శాస్త్రవేత్త పీఎం భార్గవను కూడా పిలవలేదు. ఇది చాలు సద స్సు దశ, దిశను తెలుసుకోవడానికి. మూడు, నాలుగు దశాబ్దాలుగా అంతర్జాతీయ సదస్సులు చర్చించే అంశాలు, చర్చిస్తామని చెప్పే అంశాలు, చెప్పి, చర్చించే అంశాలకు వాస్తవంలో ఈ సదస్సుల వెనక ఉండే ఆర్థికశక్తుల ఆచరణకు ఏం సంబంధం ఉండదు. నిజానికి ఆచరణ దిగజారి ప్రపంచం విధ్వంసానికి గురవుతున్నప్పుడు, సామాన్య ప్రజలు, మధ్య తరగతి తమ అనుభవాన్ని అవగాహన చేసుకుంటున్న సందర్భంలో మన మనసులోని మాటలను ఈ సదస్సులే చర్చిస్తాయి. దాంతో వ్యవస్థ మీద కొత్త ఆశలను కొత్త విశ్వాసాలను కలిగిస్తాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మూడవ ప్రపంచం అనబడే దేశాలలో అప్పుడే స్వాతంత్య్ర ఆకాంక్ష మొలకెత్తుతున్న రోజుల్లో అంతర్జాతీయ మానవ హక్కుల రూపకల్పన జరిగింది. ఇక రాబోయే ప్రపంచం మానవహక్కుల పునాది మీద నిలబడి రాజ్యం ప్రజలకు బాధ్యత వహించి స్వేచ్ఛాయుత ప్రపంచ నిర్మాణం జరుగుతుందన్న ఆశను కల్పించారు. ఆరు దశాబ్దాల తర్వాత మానవ హక్కుల స్థానంలో ‘టెపూరరిజం’ చర్చకు వచ్చి దాన్ని ఎదుర్కొనడానికి రాజ్యమే ఒక టెర్రరిస్టుగా మారింది. ఈ దుమారంలో మానవహక్కుల ప్రమాణాలు ఎక్కడ కొట్టుకుపోయాయో తెలియదు. ఈ విధ్వంసం అగ్రభాగాన అమెరికా ఉంది.
1960వ దశాబ్ద చివరిలో ప్రపంచ వ్యాప్తంగా నిరసన జ్వాలలు పెరిగి, యువత కొత్త ప్రత్యామ్నాయాలు వెతుకుతున్న తరుణంలో 1967లో టెహ్రాన్లో అంతర్జాతీయ మాన వ హక్కు ల సదస్సు జరిగింది. ఆ సదస్సులో ప్రధానంగా యువత పాత్ర మీద, అలాగే కూలిపోతున్న కుటుంబ వ్యవస్థ మీద పెద్ద చర్చ జరిగింది. మళ్లీ 1990లో సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత, కమ్యూనిజం వైఫల్యం చెందడానికి కారణాలను వెతుకుతూ వ్యక్తి స్వేచ్ఛను, మానవ హక్కులను గౌరవించకపోవడం వల్లేనని తేల్చేందుకు 1993లో వియన్నా లో రెండవ అంతర్జాతీయ మానవ హక్కుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో పెట్టుబడిదారీ దేశాల్లో ప్రజ లు స్వేచ్ఛగా జీవిస్తున్నారని, రాజ్యం కేంద్రంగా జరిగే అభివృద్ధి నియంతృత్వానికి దారి తీస్తుందని, రాజ్యానికి ప్రత్యామ్నాయం మార్కె అంటూ, మరి సంక్షేమం మాటేమిటి అంటే వాటిని ఎన్జీవోలకు అప్పజెప్పాలనే దిశగా చర్చలు జరిగాయి. బహుశా అంతకు ముందు ఎన్నడూలేని విధంగా ఈ సదస్సులో ఎన్జీవోలకు భాగస్వామ్యం కల్పించారు. అలాగే మహిళల సాధికారత మీద, ఆదివాసీల హక్కుల మీద, జాతి వివక్ష మీద అంతర్జాతీయ సదస్సులు జరిగాయి. నిజానికి గత అరవై ఏళ్లలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో మానవ హక్కులకు సంబంధించి దాదా పు వంద ఒప్పందాలు, ప్రకటనలు చేయడమే కాక, కొత్త ప్రమాణాలు నిర్ధారించబడ్డాయి. అంతిమంగా ఈ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న ఐక్యరాజ్య సమితిని నిర్వీర్యం చేసి, దానిమాట వినే నాథులే లేకుండా చేశారు.
పర్యావరణం మీద కూడా చాలా సదస్సులే జరిగా యి. అందులో 1990లలో ఈఅంశం మీద చాలా పెద్ద చర్చే జరిగింది. అప్పుడే ఎజెండా 21 అని 21వ శతాబ్దపు అజెండా ఒకదాన్ని అంగీకరించారు. ఈ సదస్సు నయా ఆర్థిక విధానం విస్తరణ క్రమంలో జరిగింది. పర్యావరణాన్ని విధ్వంసం చేసే ప్రక్రియను పెంచి, అది పెంచుతున్న వాళ్లే సదస్సుకు కావలసిన వనరులను కూర్చి, చర్చలను ప్రోత్సహిస్తుంటారు. హైదరాబాద్లో జరుగుతున్న సద స్సు, ప్రపంచ ‘వాతావరణం’ మారి మానవ మనుగడే ప్రమాదం అని ఒకవైపు అంటూ ఉంటే, అమెరికా, కొన్ని యూరప్ దేశాలు తమ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి అణు రియాక్టర్లను అమ్ముతున్నారు. ఒకవైపు అణువిద్యుత్ ఉత్పత్తికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతుంటే, హైదరాబాద్లో జీవవైవిధ్య సదస్సు జరగడం ఎంత విచిత్రం!
ఈ సదస్సుకు ఎవరిని పిలిచారో, ఏం చర్చిస్తున్నారో మీడియా పూర్తిగా బయట కు తీసుకరావడం లేదు. ‘హిందూ’ లాంటి పత్రికలు షర్మిలా పాదయావూతను పతాక శీర్షికగా వేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పర్యావరణం మీద తీవ్రమైన చర్చ జరపవలసిన జాతీయ మీడియా, మమత బెనర్జీ మతిలేని మాటల మీద, అరవింద్ కేజ్రీవాల్ మీద, ప్రియాంక గాంధీ భర్త మీద ఎడతెగని చర్చలు జరుపుతున్నారు. నిజానికి ఈ మూడు వారాలు అభివృద్ధి నమూనా మీద, నయా పెట్టుబడిదారీ వ్యవ స్థ మీద, పెట్టుబడిదార్ల అత్యాశ మీద, పెరుగుతున్న వస్తు వ్యామోహం మీద, భవిష్యత్ తరాల పట్ల బాధ్యత మీద జరగవలిసి ఉండే. కానీ ఈ పెడ ధోరణుల వెనక ఉండే శక్తుల చేతిలోనే మీడియా ఉంది.
హైదరాబాద్లో జరుగుతున్న ఈ సదస్సు ఈ ప్రాంతంలో నడుస్తున్న ఒక మహత్తర పోరాట కాలంలో జరుగుతున్నది. ఆ పోరాటంలో భాగమైన తెలంగాణ జర్నలిస్టులను ప్రధానమంత్రి ప్రసంగానికి రానివ్వలేదు. నిర్వాహకులకు ప్రజల పట్ల బాధ్యత ఉన్నా లేదా జీవరాసుల మీద ప్రేమ ఉన్నా, ఒక అర్ధ శతాబ్దం కింద హైదరాబాద్ నగరం ఎలా ఉండేదో, ఎన్ని చెరువులు, ఎన్ని పక్షులు, ఎన్ని పాములు, ఎన్ని పురుగులు, ఎన్నిపూలు, ఎన్ని పార్కులు ఉండేవో చూపించి, తర్వాత ఇప్పటి బోసిపోయిన హైదరాబాద్ను,దాని కేంద్రంగా నడుస్తున్న ఒక ప్రాంతీయ ఉద్యమా న్ని, అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్న గిరిజన, బలహీనవర్గాల ఉద్యమాన్ని, రైతుల ఆత్మహత్యలను మొత్తంగా చర్చిస్తే ప్రపంచం, పర్యావరణం, దాని విధ్వంసం ఎలా జరిగిందో కళ్లకు కట్టినట్టుగా, బుద్ధుడికి జ్ఞానోదయమైనట్టుగా ఉండేది. కార్యకారణాలు తెలిశాయి. బుద్ధుడు కూడా మానవుడి వేదనకు కారణం పెరుగుతున్న కోరికలే అని 2500 సంవత్సరాల కిందట విశ్లేషించాడు.
ఈ నగరంలో ఉండే అందమైన, అద్భుతమైన గుట్టలు, గుట్టల మీద మనుషుల్లో లేదా ఎవరో అర్కిటెక్ట్ అమర్చినట్టు తోచే రాతి వరసలు ఏమయ్యాయి? అబ్దుల్ కలాం తన ఆత్మకథలో హైదరాబాద్ (బిల్డర్స్)రాళ్ల నిర్మాణం మీద ఉండే తన మమకారాన్ని గురించి రాసుకున్నాడు. బంజారా,జూబ్లీహిల్స్ను ఎవరు ఆక్రమించుకున్నారు? లగడపాటి, కావూరి, నార్నెల పేర్లు ఈ గుట్టలకు ఎవరు పెట్టారు? గుట్టలు గుట్టలే వ్యక్తుల సొంత ఆస్తి కావడమేమిటి? అందమైన నౌబత్పహాడ్ మీద బిర్లాకు ఆధిపత్యం ఎలా వచ్చింది? మౌలికంగా ప్రశ్న అడగాలంటే ప్రకృతి ఎవరికి చెందిం దితైపకృతి మీద మనిషి ఆధిపత్యాన్నే ప్రశ్నిస్తున పర్యావరణ ఉద్యమాలుండగా, ప్రైవేట్ వ్యక్తులకు ప్రకృతి వనరుల మీద ఆధిపత్యమేమిటి అనే ప్రశ్న కూడా అడగా లి కదా? సదస్సు స్పృహలో ఈ ప్రశ్నలుండి ఉండవు. ఉండడానికి వాళ్లకంటూ ఒక ప్రాపంచిక దృక్పథం ఉండాలి కదా.
సదస్సు జరుగుతున్న స్థలానికి రాయివిసిరితే, లేదా కూతకూస్తే వినేంత దూరం లో విజయభాస్కర్డ్డి బొటానికల్ గార్డెన్ ఉంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న కాలంలోనే మేం చూస్తూ చూస్తూనే ఈ మొత్తం గార్డెన్ను రాజశేఖర్డ్డి ప్రభుత్వం ఒక ప్రైవేట్ వ్యక్తికి ‘ఇకో టూరి జం’ పేర నజరానా ఇచ్చింది. ఇక్కడ ఏడు నక్షవూతాల హోటల్ కడ్తారట. మా కళ్ల ముందే వందల చెట్లను నరికేశారు. ఈపార్కులో స్వేచ్ఛ గా తిరుగుతూ నాట్యం చేసే నెమళ్లు అనాథలయ్యాయి. అవి ఎక్కడికి పోవాలో తెలియక ఎత్తైన గోడలను దాటడం నేర్చుకున్నాయి. కొన్ని నెమళ్లు న్యాయాన్ని వెతుకుతూ హైటెక్ భవనం చేరుకున్నాయి. చివరికి పార్కులో ఉదయం నడక కోసం వెళ్తున్న వాళ్లంతా ఒక అసోసియేషన్ పెట్టుకుని, హైకోర్టుకు వెళితే, విధ్వంసం తాత్కాలికంగా ఆగింది. అలాగే అందమైన హుస్సేన్సాగర్ ఆక్రమణకు గురై అక్రమ కట్టడాలు వెలిశాయి. దీన్ని రక్షించాలని సుప్రీంకోర్టులో కేసు వేస్తే తాత్కాలికంగా స్టే వచ్చింది. ఈ నగరంలో జీవవైవిధ్య సదస్సు పెట్టి హైదరాబాద్కు జీవవైవిధ్యంలో పాస్ మార్కులు వచ్చాయని ముఖ్యమంత్రి, మేయర్ ఆనందపడిపోతున్నా రు. కానీ 90 మార్కులకు దాదాపు 90మార్కులు వచ్చే నగరం 30మార్కుల స్థాయికి దిగజారడానికి కన్నీళ్లు పెట్టుకోవాలి కదా?
నిజానికి జీవ వైవిధ్య సదస్సు చర్చించవలసిన తాత్విక, చారివూతక ప్రశ్నలు చాలా మౌలికమైనవి. ఒక టి; ప్రకృతికి మనిషికి ఉండే సంబంధమేమిటి? ప్రకృతి శక్తులతో మనిషి పోరాటం చేసిన మాట నిజమే. ప్రకృతిని పూజించే మనిషే, ప్రకృతి మీద కొన్ని విజయాలు సాధించిన మాట కూడా నిజమే. మనిషికి ప్రకృతికి గతంలో ఉండేది స్నేహపూరిత వైరుధ్యమే. దాన్ని శత్రుపూరిత వైరుధ్యంగా మార్చిన పెట్టుబడిదారుల ప్రయోజనాల నేపథ్యంలో జరిగే సదస్సు, ప్రకృతిని ఎలా ప్రేమించగలదు? ప్రకృతిని పూర్తిగా నాశనం చేసే దాకా ‘విక్షిశాంతి’ తీసుకునేట్టు లేదు. నిజానికి నిజాయితీ ఉంటే సదస్సు ఈ దోపిడీ వ్యవస్థ మీద యుద్ధమే ప్రకటించాలి.
ప్రకృతిలోని వైవిధ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని వైరుధ్యాలను పరిష్కరించడం అనివార్యం. దీంట్లో ప్రకృతి మనిషి మధ్య వైరుధ్యమే కాక, పెట్టుబడికి ప్రకృతికి, అలాగే సామ్రాజ్యవాద దురాశకు అడవికి (అడవిలోని వనరుల) మధ్య ఏర్పడిన వైరుధ్యాన్ని ఎదుర్కొవాలి. మన దేశంలో అట్టడుగున, అతి నిరాడంబరంగా బతుకుతున్న గిరిజనులు సహజ వనరులను, ప్రకృతి సంపదను, అడవిలోని జీవరాసుల సంరక్షణ కోసం పోరాడుతున్నారు. అలాగే ప్రజాస్వామ్యవాదులు ప్రకృతి విధ్వంసానికి కారణమయ్యే ప్రాజెక్టులకు, పరిక్షిశమలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
గంగానదిని కాపాడడానికి నిరంతరంగా ఓ పోరాటం జరుగుతుంది. మనదేశం, ముఖ్యంగా హిందూమతం చాలా విచివూతమైన మతం. ప్రతిదినం సాయంత్రం గంగానదికి పెద్ద ఎత్తున హారతి ఇస్తుంటారు. ఈ పూజించడం దశాబ్దాలుగా జరుగుతున్నది. కానీ సంగీతం, నాట్యం, ఆ దీపాల వెలుగులోనే నేను చిన్నతనంలో చూసిన స్వచ్ఛమైన గంగానది ఒక డ్రైనేజీ కాలువగా మారిపోయింది. కలుషితమైన నీళ్లను కూడా పూజిస్తూనే ఉన్నారు. హారతి పడుతూనే ఉన్నారు. ఇది వైవిధ్యమా? లేక వైరుధ్యమా? సదస్సు ఈ ప్రశ్నకు జవాబు వెతకడం లేదు. పరిష్కారానికి మార్గం అసలే వెయ్యడం లేదు. అయినా ఇలాంటి సదస్సులు ఒక భ్రమాజనిత విశ్వాసాన్ని కలిగించడానికి ‘ప్రకృతి విధ్వంసకారులు’ వీటికి ఆతిథ్యం కల్పించి ఆనందపడుతూనే ఉంటారు. విధ్వంసాన్ని ప్రశ్నించనంత కాలం ప్రశ్నలకు సమాధానాలు లేని ఇలాంటి సదస్సులు జరుగుతూనే ఉంటాయి.
పాలమూరు మీనాంబరం వాగు ఏమైంది? (11-10-2012)
మహబూబ్నగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు తెలంగాణ డిమాండ్తో ఢిల్లీ వెళ్లారని విని నా బోటి వాడికి చాలా ఆశ్యర్యమేసింది. ఇంత పెద్ద ప్రజాఉద్యమం జరుగుతున్నప్పుడు, సెప్టెంబర్30న ప్రజా సమూహాన్ని చూసిన తర్వాత, తెలంగాణ ప్రజా వూపతినిధులంతా తమ పార్టీ పునాదులు ఎలా కదులుతున్నాయో గ్రహించి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటన్న ఆందోళన వాళ్లకు కలిగి ఉండాలి. అలా ఆందోళన పడకపోతే వాళ్లకు ప్రజల పట్ల ఎంత చులకనో అర్థమవుతుంది. రాజకీయాల్లో ఏ ఆశయాలు, ఆదర్శాలు లేకున్నా తమ సొంత మనుగడకే ప్రమాదం ఏర్పడినప్పుడైనా కదలాలి. ప్రజలతో నడవాలి.ఈ ఇంగిత జ్ఞానం తెలంగాణ రాజకీయ నాయకులకు లేదా? లేక 2014 ఎన్నికల వరకు అధికారంలోఎలాగో ఒకలాగ కొనసాగితే చాలు అనే అల్పసంతోషంతో ఉన్నారా? ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా రాజకీయ నాయకులకు కొంచమైనా జ్ఞానోదయమైనందుకు సంతోషించాలి.
తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేయవలసిన అవసరం, అగత్యం, బాధ్యత మహబూబ్నగర్ ప్రతినిధులకు అందరికంటే ఎక్కువ ఉన్నది. ఢిల్లీలో వాళ్లు వేరే వాదనలేవీ చెప్పనవసరం లేదు. మహబూబ్నగర్ జిల్లాకు సమైక్య రాష్ట్రంలో ఎంత అన్యాయం జరిగిందో వివరిస్తే చాలు. అది అధిష్ఠానానికి అర్థమైతే తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత ఏమిటో అర్థమవుతుంది. కానీ మహబూబ్నగర్ రాజకీయ నాయకత్వానికి ఆ అవసరం ఏ మేరకు అర్థమయ్యిందో ఆ వాదనలను ఎంత పటిష్టంగా ముందు పెట్టగలిగిందో మనకు తెలియదు.పాలమూరు దుస్థితికి రాజకీయ నాయకత్వం బాధ్యత వహించి, ఇప్పటికైనా పాలమూరు పేద ప్రజల పక్షాన మాట్లాడడం నేర్చుకోవాలి.
కృష్ణానది 2,70,2baba0 కిలోమీటర్లు జిల్లా గుండా ప్రవహిస్తుంటే తుంగభద్ర నదిలో ఈ జిల్లాకు రావలసిన న్యాయమైన వాటా వస్తే, మహబూబ్నగర్ జిల్లాలోనే కాక పట్టణంలో కూడా నీళ్ల కోసం అన్ని కష్టాలు ఎందుకు? ఇదేం ఎడారి ప్రాంతం కాదు. జీవనదులు ప్రవహిస్తున్న జిల్లా. ఈ జిల్లా నుంచి లక్షలాది మంది వలసలు పోవడం ఏమిటి? కరువు చావులు ఏమిటి? వ్యవసాయం కోసం బోరుబావులు తవ్వడమెందు కు? రాత్రివేళల్లో కరెంటుకోసం పొలాలకు వెళ్లి పాముకాటుతో చావడమెందుకు? కోస్తా జిల్లా రైతులా బతకవలసిన పాలమూరు రైతులు దయనీయమైన స్థితికి ఎందుకు నెట్టివేయబడ్డారు? ఈ ప్రశ్నలు మనందరిని నిలదీస్తున్నయిపజావూపతినిధులు యాభై ఏళ్ల కిందటే ఇలా ఢిల్లీకి వెళ్లవలసి ఉండే. బచావత్ ట్రిబ్యునల్తో కొట్లాడవలసి ఉండే.
పాపం బచావత్ మహబూబ్నగర్ గురించి ఎవ్వరూ ఏమీ అడగడం లేదని దయదలిచి జాలిపడి జూరాల ప్రాజెక్టును తన అవార్డులో చేర్చాడు. 1969 తెలంగాణ ఉద్యమం తర్వాత జరిగిన ఒప్పందంలో పాలమూరు నీళ్ల గురించి ప్రస్తావన ఎందుకు లేదు? అరవైలలో జరిగిన ఉద్యమంలో పాలమూరు ప్రజలను చైతన్యవంతులను ఎందుకు చేయలేదు? అలా చేయకపోవడం అప్పటి ఉద్యమ వైఫల్యం. సరే నదులలో నీళ్ల వాటా రాకున్నా, ఉన్న సహజ జలవనరులు ఎందుకు విధ్వంసమయ్యాయి? చెరువులు, కుంటలు, వాగులు, బావులు ఏమైనట్టు? లేనిదానికి కొట్లాడకపోయినా, ఉన్నవాటిని రక్షించుకోకపోవడం ఒక తెలివిహీనత. పాలమూరు మెట్ట ప్రాంతం కావడం వల్ల చెరువులకు, కుంటలకు చాలా అనువైన ప్రాంతం. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా చెరువులు ఉండేవి. ఒక్కొక్క చెరువు వెనక ఒక కథే ఉన్నది. కొన్ని చెరువుల నిర్మాణానికి ప్రాణత్యాగాలు చేశారనే కథలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నిజమైనా, కాకున్నా జనంలో ఈ కథల ప్రాచుర్యం చెరువుల ప్రాధాన్యాన్ని చాటుతుంది. ఈ మొత్తం అభివృద్ధి క్రమక్షికమంగా విధ్వంసమౌతూ, భారీ నీటి ప్రాజెక్టుల ప్రాధాన్యం పెంచుతూ వచ్చారు.
కోస్తాంవూధకు ఉండే నైసర్గిక స్వభావం వల్ల భారీ ప్రాజెక్టుల అవసరం వాళ్లకు ఎక్కువ. అక్కడ కుంటలు, చెరువులు, బావుల నిర్మాణం చాలా కష్టం. అందుకే 1baba52లో కృష్ణా, గోదావరి నదుల మీద ఆనకట్టలు కట్టి బ్రిటిష్వాడు ఆ ప్రాంతా న్ని అభివృద్ధి చేశాడు. ఆ అభివృద్ధి అనుభవంతో విశాలాంధ్ర ఏర్పాటు తర్వాత నిధులను భారీ నీటి పారుదలకు కేటాయిస్తూ, నాగార్జునసాగర్ లాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. అదే క్రమంలో చిన్న నీటి తరహా ప్రాజెక్టులకు కూడా అంతే ప్రాధాన్యం ఇచ్చి ఉంటే ప్రాంతీయ అసమానతలు ఇంత పెద్ద ఎత్తున పెరిగేవి కావు. దీనికి తోడు ‘హరిత విప్లవం’ నీటి కొరత ఉన్న ప్రాంతాలకు ఒక శాపంగా మారింది.
ఈ వ్యవసాయక మార్పు సంపూర్ణంగా, సమృద్ధిగా నీళ్లు ఉండే ప్రాంతానికి మాత్రమే ప్రయోజనం. పోనీ నీటి వనరులు తక్కువున్న ప్రాంతం పంటల ను, జల వనరులను, వందల సంవత్సరాల వ్యవసాయ పద్ధతులను కాపాడి, దేశీయ విజ్ఞానం ఆధారంగా వీటిని మెరుగుపరిచే బదులు, వెనుకబడిన ప్రాంతాల వనరులతో సంబంధం లేకుండా, అన్ని ప్రాంతాలలో ‘హరిత విప్లవాన్ని’ ప్రోత్సహించడంతో, వేల సంవత్సరాలుగా తెలంగాణ పండిస్తున్న జొన్నలు, సజ్జలు, తైద లు, వేరుశనగ, ఆముదం, కందులు లాంటి పంటలు క్రమేణా క్షీణిస్తూ వచ్చాయి. హరితవిప్లవంతో దిగుమతి చేసుకున్న కొత్త వంగడాలు ప్రవేశపెట్టడంతో, చెరువులు, కుంటలు, బావుల స్థానంలో, వినాశనకరమైన బోరుబావులు రావడంతో పాలమూరు రైతుల పరిస్థితి మరింత దీనంగా మారింది. రాజకీయ, ఆర్థిక చైతన్యం లేకపోవడం వల్ల వస్తున్న మార్పులను సరిగ్గా అంచనా వేయకపోవడం వల్ల, వందల సంవత్సరాల తమ సమష్టి వ్యవసాయక అనుభవం రైతులకు నిరుపయోగమైపోయింది.
ప్రతి అవసరానికి రైతు మార్కెట్లకు పరిగెత్తే పరిస్థితి ఏర్పడడంతో, పంటలకు సరైన ధరలు రాకపోవడంతో, గ్రామీణ జీవనం విచ్ఛిన్నమౌతూ వచ్చిం ది. ఈ విచ్ఛిన్నం నుంచే భారీ నీటి ప్రాజెక్టులు తమకూ కావాలనే డిమాండ్ తెలంగాణ ప్రాంతంలో ఉద్యమంలో పెరిగి, 1960లో ఉద్యమంలో లేని రాజకీయ అవగాహన 21వ శతాబ్ద తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా ముందుకువచ్చింది.
ఈ జిల్లాలో ఉండే చెరువులు, కుంటలు ఎలా విధ్వంసమయ్యాయో జడ్చర్ల పట్టణంలోని ఊర చెరువు, అంతకుమించి పట్టణానికి ఐదు కిలోమీటర్లలో ఉన్న అద్భుతమైన మీనాంబరం వాగును చూస్తే చాలు. తెలంగాణ ఉద్యమకారులందరూ పాలమూరు జిల్లాకు వెళితే ఈ రెండు ప్రదేశాలను చూస్తే చాలు. అరవై ఏళ్ల రాజకీయ, ఆర్థిక ‘అభివృద్ధి’ ఏమిటో? దాని విషరూపమేమిటో అర్థమవుతుంది. నూతన ఆర్థిక విధానాల పుణ్యమా అని పాలమూరు వ్యవసాయం మరింత విధ్వంసం కావడానికి కారణమై ఆత్మహత్యల దాకా చేరుకుంది.
దీనితోపాటు ఇసుక మాఫియా పుట్టుకొచ్చింది. ఒక మధ్యతరగతికి చెంది న విజయ్కుమార్ అనే కాంట్రాక్టర్ (కోస్తాంధ్ర కాంట్రాక్టర్) కోటీశ్వరుడు కాగలిగాడు. ఆయన చేసిన విధ్వంసానికి ప్రతీకగా ఆయన తల్లిదంవూడుల విగ్రహాలను జడ్చర్ల దగ్గర ప్రతిష్టించాడు. ఇలాంటి విగ్రహాల మీద ఆగ్రహాలు ఉండడం సహజం. ఇసుక తరలింపులో భూగర్భ జలాలు పాతాళానికి పోవడంతో బోరుబావులు 400-500 అడుగుల దాకా చేరడంతో వ్యవసాయం అసాధ్యమైపోయింది.
మీనాంబరం వాగును చూడడానికి మిత్రుడు పాలమూరు అధ్యయన వేదిక నాయకులలో ఒకరు యాదగిరితో కలిసి వెళ్లాం. యాదగిరి అలియాస్ ఉదయమిత్ర ఆక్టివిస్టే కాదు, రచయిత, కవి, అధ్యాపకు డు. ఆయనకు తోడు జడ్చర్లలో ఈ అంశాల పట్ల ఆందోళన చెందుతున్న కొందరు యువకులు, పౌరు లు ‘వనరుల సంరక్షణ కమిటీ’ని ఏర్పాటు చేసి జంగ య్య కన్వీనర్గా, రవిశంకర్ కో-కన్వీనర్గా పౌర సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి కృషి చేస్తున్నారు.
మీనాంబరం వాగుతో పాటు జడ్చర్ల ఊర చెరువు ఎలా దురాక్షికమణలకు గురైందో, చెరువు శికంలో కట్టడాలు ఎలా వచ్చాయో చూపించారు. నగరం నడి ఒడ్డున ఉండి మొత్తం పట్టణానికి ప్రాణాధారంగా ఉండే ఈ చెరువు తమ కళ్లముందే విధ్వం సం అవుతూ ఉంటే, జడ్చర్ల, బాదేపల్లి ప్రజలు ఎందుకు మాట్లాడలేదో? ప్రజావూపతినిధులు ఎందుకు పట్టించుకోలేదు?
ఇప్పుడు మీనాంబరం వాగులో కొనసాగుతున్న ఇసుక తరలింపును చూస్తే, భూకంపం వస్తే పడి ఉన్న శవాల వలె వందల ఏళ్లుగా ఎదిగిన మహావృక్షాలు కూలిపడి ఉన్నాయి. వాగును తవ్వుతూ తవ్వుతూ వాగు ఒడ్డున ఉన్న దేవాలయం పునాదుల దాకా వచ్చారు. ఇంకా ఒక్క ఇంచు తవ్వినా గుడి కూలిపోతుంది. ప్రజలను దేవుడే రక్షించాలి అన్నట్లు దేవాలయం ఇసుక తవ్వడానికి అడ్డుపడింది. నూతన ఆర్థిక విధానం ఎంత దుర్మార్గమైందంటే అది గుడిని, గుడిలోని లింగాన్ని మింగగలదు. ఆ లింగాన్ని మింగి స్వాముల నోటి లో నుంచి బయటికి తీసి మళ్లీ ప్రజలను నమ్మించగలదు. ఆ స్వాముల ఆశీస్సులు కాంట్రాక్టర్లకు ఎలాగూ ఉంటాయి. ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినదని ఇప్పటికీ వేలాదిమందితో జాతర జరుగుతుందని అన్నప్పుడు, దేవుడి విగ్రహాన్ని కళ్లుమూసుకుని భక్తులు చూడాలనే పద్ధతి ఎందుకు వచ్చిందో అర్థమౌతుంది.
తెలంగాణ ఉద్యమ లక్ష్యం భౌగోళిక తెలంగాణ కాక ప్రజల నిత్య జీవిత సమస్యలు కూడా ముందుకు రావాలి. నీటి వనరుల రక్షణ సమస్య కీలకం కావాలి. ప్రతి చెరువు, కుంట, వాగును రక్షించుకోవడానికి, పునరుద్ధరించుకోవడానికి కమిటీలు ఏర్పడాలి. ఈ దిశగా కృషి చేయాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల మాటలు వినడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. ఇంకా ఒక అడుగు ముందుకువేసి ఈ విధ్వంసం వెనక ఉన్న సామ్రాజ్యవాద ప్రేరిత అభివృద్ధి నమూనాను ప్రశ్నించగలిగితే ప్రజల చైతన్యస్థాయి మరింత ఉన్నతస్థాయికి ఎదిగి ప్రజాస్వామ్య తెలంగాణ ఆకాంక్ష సాకారం కావడానికి దోహదపడుతుంది.
తెలంగాణ ఉద్యమంలో సెప్టెంబర్30 (27-9-2012)
దశాబ్ద కాలంలో తెలంగాణ చూసిన భిన్నమలుపులలో 2012 సెప్టెంబర్ 30 ఒక ప్రధానమైన మలుపుగా నిలిచిపోయేలా ఉద్యమం జరగాలి. జిల్లాలన్నింటిలో రాజకీయ పార్టీల జోక్యం ఉన్నా లేకున్నా ప్రజలు ఈ ‘మార్చ్’ను విజయవంతం చేయాలనే దీక్షతో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. రాజకీయ పార్టీల రంగు రంగు వేషాలతో ప్రజలు విసిగిపోయారు. అయితే 30వ తేదీన ఏం జరగబోతున్న ది అన్నది ప్రభుత్వానికి, ప్రజలకు ఒక పెద్ద సవాలు. ఈ మార్చ్కు సహజంగానే ప్రభుత్వం అనుమతి ఇవ్వనంటున్నది. ఇది కొత్త సంగతేం కాదు. గత నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు అణచివేతను భిన్న రూపాల్లో అనుభవించే ఉన్నారు. రాజకీయంగా పరిష్కరించవలసిన సమస్యలను శాంతిభవూదతల సమస్యగా చూడడం వెంగళరావు పాలనతోనే ఆ మాటకు బ్రహ్మానందడ్డి కాలంలోనే ప్రారంభమైంది. అన్ని రకాలుగా అధికార దుర్వినియోగం చేయడాన్ని చట్ట, రాజ్య వ్యవస్థ అనుమతించడంతో ఆ యంత్రాంగమే సామాజిక పరిణామానికి ప్రజాస్వామ్య వికాసానికి పెద్ద గుదిబండై కూర్చుంది. ఏ రాజకీయ నాయకు లు గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించాలో వాళ్లు హైదరాబాద్లో సౌఖ్యాలు అనుభవిస్తూ ప్రజా ఉద్యమాలను ఎదుర్కొనడానికి పోలీసులను ఉపయోగిస్తున్నారు. పోలీసులు కూడా దీన్ని కోరుకుంటున్నారు. రాజకీయ పార్టీలు, నాయకులు ప్రజాసమస్యల నుంచి తప్పించుకొని తిరిగినంత కాలం ప్రజా నిరసన భిన్న రూపాల్లో వ్యక్తమవుతుందని తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లేదా భిన్న ఉద్యమాలు అలాగే నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి పౌరహక్కుల సంఘా లు విశ్లేషిస్తూనే ఉన్నాయి. ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నాయి. ఈ అవగాహనకు పరాకాష్టగా రాష్ట్రంలో ‘శాంతి చర్చలు’ జరిగాయి. శాంతి చర్చలు చరివూతలో చాలాకాలం గుర్తుండే ఒక ప్రయోగమే. వర్గాలుగా విడిపోయిన సమాజంలో శాంతి చర్చలు ఏమిటి అన్నవారు కూడా తర్వాత కాలంలో ఈ ప్రయోజనపు విశిష్టతను అంగీకరించక తప్పలేదు. శాంతి చర్చల విఫలం నక్సలైట్లకు ఎంత నష్టం చేశాయో తెలియదు. కానీ ‘శాంతి’కి ప్రజాస్వామ్యానికి అది పెద్ద విఘాతాన్ని కలిగించింది.
ఈ పర్యాయం తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి రెండు కళ్లు, రెండు చెవులు, రెండు నాలుకలు, మూడు ఆలోచనలు బార్లా తెరిచే ఉన్నాయి. కానీ ఒక సమస్యకు రెండు పరిష్కారాలుండవు. ఈ ఉద్యమం ఏ సాధించినా, సాధించకున్నా ప్రజా అవగాహనను, చైతన్యాన్ని పెంచింది. అందుకే మొత్తం దేశంలో తెలంగాణ ప్రాంత చైతన్యస్థాయి, మరే ప్రాంతంలో లేదు, ఉన్నా నాకు తెలియదు. అయితే ఉద్యమంలో, చాలా సందర్భాల్లో పేర్కొన్నట్లు, తెలంగాణ యువత పాటించవలసిన నిజాయితీ, నిబద్ధత ఏ స్థాయిలో ఉండాల్లో ఆ స్థాయిలో లేకపోవడం ఒక లోటే. అయితే సెప్టెంబర్30న తెలంగాణ యువతకు, విద్యార్థి లోకానికి ఒక పెద్ద పరీక్ష. ఈ పరీక్షలో పాస్ కాకపోతే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినట్లే. ఏ ఆశలకు లొంగకుండా నిటారుగా నిలబడగలిగితే, తర్వాత జీవిత కాలమంతా ఆత్మవిశ్వాసంతో, సగర్వంగా బతకవచ్చు. ఈ చైతన్యం ప్రజా సమీకరణలో, ప్రజలను చైతన్య పరచడంలో విద్యార్థులు, విద్యావంతులు తమ వంతు పాత్రను నిర్వహించవలసి ఉంది.
ప్రభుత్వం ఈ ‘మార్చ్’కు అంత సులభంగా అనుమతి ఇస్తుందన్న నమ్మకం లేదు. అనుమతి ఇస్తే కిరణ్కుమార్డ్డి ప్రభుత్వం ప్రజాస్వా మ్య సంస్కృతిని కొంత కాపాడినట్టే. అనుమతి ఇవ్వడమే కాక తాము ప్రత్యక్షంగా, పరోక్షంగా పెంచి పోషించిన గూండాలను, మాఫియాను, అసాంఘిక శక్తులను ‘మార్చ్’ను హింసాయుతం కానీయకుండా చూడగలిగితే లేదా ఆపగలిగితే అది ప్రజాస్వామ్య విజయంగా గుర్తించవలసి ఉంటుంది. అలా జరిగితే తెలంగాణ రాష్ట్ర ప్రకటన కొంత ఆలస్యమైనా ప్రజలు మరికొంత కాలం ఓపిక పట్టవచ్చు. శాంతియుత పద్ధతుల ద్వారా, ప్రజాస్వామ్య ఉద్యమాల ద్వారా తమ లక్ష్యాలను సాధించుకోవచ్చనే విశ్వాసమే ప్రజలకు కలిగితే, వ్యవస్థాపక హింస పాత్ర కూడా కొంత తగ్గవచ్చు. ఈ మధ్య కాలంలో భిన్న దేశాల ప్రజల నిరసన వెల్లువ, ఏ హింస లేకుండా నియంతలను అధికార పీఠం నుంచి దించగలిగారు. ఉద్యమాలలోని హింసస్థాయి రాజ్యహింస స్థాయిని బట్టే ఉంటుంది. రాజ్యం ప్రజాస్వామికంగా ప్రవర్తిస్తే, ప్రజలను శాంతియుత ఉద్యమం ద్వారా తమ సమస్యలు పరిష్కారమౌతాయనే విశ్వాసమే కలిగితే, అది కలిగించగలిగితే జనజీవన స్రవంతి ఒక గంతు వేసినట్లే. ఒకమలుపు తిరిగినట్లే.
సెప్టెంబర్ 30న మార్చ్ను అంత ప్రజాస్వామికంగా పాలకులు అనుమతిస్తారని ఆశించడం అత్యాశే. కొందరు స్నేహితులు మీరు మరీ కలలు కనడం మొదలుపెట్టారు అని అనవచ్చు. శాంతియుత ఉద్యమాలను ప్రోత్సహిస్తే, హైదరాబాద్లో వేలాది ఎకరాలు భూమిని ఆక్రమించుకున్నవారు, అక్రమ సంపాదనను కూడబెట్టుకున్నవారికి, అధికారాన్ని దుర్వినియోగం చేసిన వారికి ‘శాంతి’ పెద్ద శత్రువు. శాంతి మనిషిని తనలోని ‘ఆ మనిషి’ చూడడానికి ఒక అవకాశం. పాలకులకు తమ లోపలి మనిషిని చూసే ధైర్యం ఉండదు. అలా చూడడం చాలా మౌలిక ప్రశ్నలకు దారితీస్తుంది. చివరకు మనం ఎందుకు జీవిస్తున్నాం, జీవితానికి అర్థమేమిటో, ఈ సంపద కూడబెట్టి ఏం చేస్తాం అనే ప్రశ్నలకు దారితీయవచ్చు. అందుకే అమాయకమైన, నిరాడంబరమైన, నిజాయితీగా బతుకుతున్న ఏ మనిషైనా రాజ్యాన్ని భయపెట్టగలడు. అందుకే అలా అడవిలో జీవిస్తున్న ఆదివాసీల మీద యుద్ధమే ప్రకటించారు. ఆదివాసీల జీవన విధానం వలసవాదానికి, పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రమాద మే. వాళ్ల జీవన విధానం ఒక దృష్టాంతం గా ఉన్నంత కాలం నూతన ఆర్థిక విధానానికి నిద్రపట్టదు.
రెండవ తరం ఆర్థిక సంస్కరణల పేరు మీద, వృద్ధి రేటు పడిపోయిందని, రెండు దశాబ్దాల ప్రయోగం తర్వాత సంస్కరణలను పునః పరిశీలించే బదు లు వాటిని మునుముందుకు తీసుకు పోవడానికి ప్రపంచ పెట్టుబడికి ఏజెంట్ అయిన చిదంబరం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా కీలక సమయంలో బ్రేక్ వేయవలసిన సోనియాగాంధీ ఈ సంస్కరణలకు తన పూర్తి మద్దతును తెలిపారు. భవిష్యత్ ప్రధాని అని తలుస్తున్న రాహుల్గాంధీ అవగాహన ఏమిటో తెలియదు. అందరూ ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నారు. సంస్కరణలు ముందుకుపోయినకొద్దీ జరగబోయేది ప్రమాదమే. ఈ పర్యవసానాన్ని గురించి నోబెల్ బహుమతి గ్రహీత జోసె ఫ్ స్టిగ్లిడ్చ్ తన ‘Price For In equality’ అసమానతల మూల్యం. అంటే పెరుగుతున్న అసమానతలకు రాజకీయాలు చెల్లించవలసిన మూల్యా న్ని గురించి వివరంగానే రాశాడు. ఈ రచనలో ‘ఒకరి చేత, ఒకరి కొరకు, ఒక వలన’ జరుగుతున్న పాలన 99 మంది ఆగ్రహాన్ని చూడక తప్పదు. నిజానికి తెలంగాణ మార్చ్కు ఇది చారివూతక, రాజకీయ, ఆర్థిక నేపథ్యం. అందుకే సెప్టెంబర్ 30 మార్చ్ ఒక ప్రధానమైన ప్రయోగంగా చూడవలసి ఉంటుంది.
మార్చ్ను జరగనివ్వకపోతే ప్రతి పట్టణం, ప్రతిక్షిగామం ఒక ట్యాంక్బండ్, ఒక ఇందిరాపార్క్, ఒక అమరవీరుల స్థూప చిహ్నంగా మారాలి. గ్రామక్షిగామంలో మార్చ్ జరగాలి. అవి మీడియా దృష్టికి రాకపోవచ్చు. రావు కూడా. మీడియా చరివూతను విశ్లేషించే సాధనం కాదు. ఇప్పటి సమకాలీన మీడియా చరిత్ర గమనాన్ని అడ్డుకోవడానికి చాలా ప్రయాస పడుతున్నది. చరిత్ర చోదకశక్తులు గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నాయి. ప్రతి గ్రామంలో ప్రజలు ముక్తకం తెలంగాణ రాష్ట్ర సాధనే కాక, ఒక ప్రజాస్వామ్య మానవీయ తెలంగాణ, దేశానికే ఒక నమూనాగా మార్చడానికి తమవంతు పాత్రను నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేయాలి. ఆ చైతన్యమే తెలంగాణ భవిష్యత్తుకు బాటలను వేస్తుంది.
నిండమునిగిన వాడికి చలేమిటి? (20-9-2012)
walmart చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడిని అనుమతించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని తెలుపుతూ నిర్ణయం తీసుకున్నది. తోటి ఇతర పార్టీలు అభ్యంతరం చెప్పినా మమతా బెనర్జీ తన మద్దతును ఉపసంహరించుకున్నా, నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రశ్నేలేదంటున్నది. పోరాడుతూ పోరాడుతూ పోయినా ఫర్వాలేదు అనే మన ప్రధాని, తన పదవికి న్యాయం చేయలేదు అని టైమ్ మ్యాగజైన్ అన్న తర్వాత, ఒబామా స్వయాన భారతదేశం ఆర్థిక సంస్కరణల అమలులో వెనుకబడి ఉన్నదని వ్యాఖ్యానించి న తర్వాత తెలంగాణ భాషలో చెప్పాలంటే, రోషం వచ్చింది. ఇక అగేది లేదు అని అంటున్నాడు. తొమ్మిది, పది సంవత్సరాల పదవీకాలంలో అణు ఒప్పం దం సందర్భంలో కూడా ప్రధాని చాలా మారాము చేశాడు. అదే ప్రధాని విశ్వవిద్యాలయ గ్రాంటు కమిషన్కు చైర్మన్ను నియమించలేకపోతున్నారు. కొన్ని విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులు లేరు. ఎవ్వరైనా అడిగితే తాను అశక్తుడినని అంటూనే కొన్ని ఆర్థిక కఠిన నిర్ణయాలు తప్పవు అంటున్నాడు. ఈభాష తెలుగు ప్రజలకు కొత్తేం కాదు. అలా కఠిన నిర్ణయాలు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవని కాలేజీ సర్వీసు కమిషన్ను రద్దు చేసి, విద్యుచ్చక్తి మీద సబ్సిడీ లేదని, అసలు సబ్సిడీలు ఇవ్వడమే తప్పని అంటూ మాబోటి వాళ్ళు ఎవరైనా సలహాలు ఇచ్చినా పట్టించుకొని చంద్రబాబునాయుడి పైన ప్రజలు కూడా కఠిన నిర్ణయాలు తీసుకున్నా రు. ఎంత కఠినమంటే ఆయన ప్రజలని ఎలా విస్మరించారో, ప్రజలు ఆయనని అలాగే విస్మరించారు. నిజానికి కొన్ని విషయాల్లో చంద్రబాబు, రాజశేఖర్డ్డి కంటే కొంచెం మెరుగు. కానీ రాజశేఖర్డ్డి ప్రజలకు కొన్ని రాయితీలు కల్పించడం, కొన్ని సంక్షేమ కార్యక్షికమాలు అం దించడం వల్ల ఆయన కుమారుడు జైళ్ళో ఉన్నా ప్రజలకు ఆ కుటుంబం పట్ల కొంత అభిమానం మిగిలే ఉన్నది.
ఇప్పుడు ఎవరు గెలిచినా జరిగేది ఏమిలేదు అనే నిర్ణయానికి వచ్చి దుర్మార్గులలో ఎవరు తమకు కొంత ఉరట కల్పించినా వాళ్ళ పట్ల కొంచెం సానుకూలంగా ఉన్నారు. దీనినిబట్టి ప్రజలు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారో ఊహించవచ్చు. ఇది మన రాష్ట్ర అనుభవం. ఈ అనుభవాన్ని రాష్ట్రంలోని ఏ కాంగ్రెస్ ప్రజావూపతినిధి ప్రధానికి చెప్పడం లేదా, లేక ఆయన వినడా, లేక వీళ్ళ ప్రయోజనాలు కూడా చిల్లరవ్యాపారంలో విదేశీ పెట్టుబడులతో ఏమైనా ముడిపడి ఉన్నాయా? అన్నది పెద్ద సందేహమే.
కేంద్ర ప్రభుత్వం ఒకేసారి మూడు కఠిన నిర్ణయాలను తీసుకున్నది. ఒకటి, డీజిల్ ధర పెంపు, రెండు: చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడులు; మూడు: ప్రభుత్వరంగ సంస్థల నుంచి 15 వేల కోట్ల పెట్టుబడి ఉపసంహరణ- అంటే ప్రజా ఆస్తులను ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్పచెప్పడం. అసలే ధరలు పెరుగుతూ సామాన్య ప్రజల జీవితం రోజురోజుకు దుర్భరం అవుతున్న దశలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ వచ్చే ఎన్నికల్లో మునుగుతుందిరా బాబు అంటే మునిగితే మునుగని అనే వాళ్ళకు చెప్పడం ఎంతో కష్టం. మన్మోహన్ సింగ్కు మళ్ళీ ప్రధానమంత్రి అవుతానన్న ఆశలేదు. కానీ కాంగ్రెస్పార్టీ కలిసికట్టుగా సామ్రాజ్యవాద నౌకలో మునుగదలచుకుంటే, ఏ గజ ఈతగాళ్ళు వీళ్ళని రక్షించలేరు. పోనీ బీజేపీ ఏమైనా దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తుందా అంటే, నామమావూతపు వ్యతిరేకత ఎలాగు ఉంటుంది, కానీ ప్రపంచీకరణ విషయంలో, అభివృద్ధి నమూనా విషయంలో వాళ్ళకు ప్రత్యామ్నాయ దేశాభిమాన, దేశభక్తితో కూడిన జాతీయ నమూనా ఏదీ లేదు.
కొత్తగా ఎదుగుతున్న వెనుకబడిన తరగతుల ప్రభావం కలిగిన రాజకీయ పార్టీలకు కూడా ఆర్థిక నమూనా మీద ఎలాంటి అవగాహన లేకపోవడం చాలా పెద్ద విషాదం. ఈ అంశాన్ని గురించి వ్యాసాల్లో ఎన్నిసార్లు రాశానో తెలియదు. ఇలా మళ్ళీ మళ్ళీ రాయడం ఈ అంశాల గురించి ‘నమస్తే తెలంగాణ’ పాఠకులకు చెప్పడానికే. తెలంగాణ ఒక మహో ఉద్యమంలో ఉన్నది. కొత్తరాష్ట్రమే కాదు. కొత్త ఆర్థికనమూనా కోసం పురిటి నొప్పు లు పడుతున్నది. అవుతే ప్రసవంలో వినూత్న శిశువు జన్మిస్తుందన్న నమ్మకం లేదు. వికృతశిశువు కాకుండా ఒక ఆరోగ్యకర శిశువు జన్మించినా తెలంగాణ ప్రజలు తమను తాము అభినందించుకోవచ్చు. ఎందుకో ఈసారి తెలంగాణ ఉద్యమంలో యువకుల నుంచి కొత్త రాజకీయ నాయకత్వం రాలేదు. లేదా రానివ్వలేదు. ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు తగు జాగ్రత్తలు తీసుకున్నాయి. ఎవరైనా ఎదుగుతుంటే తమలో కలుపుకున్నాయి. కొందరిని ఇతర మార్గాల ద్వారా వశపరుచుకున్నారు. అందులోంచి ఎదిగిన కళాకారులకు , కవులకు, గాయకులకు రాజకీయ, ఆర్థిక అంశాలపై అంత లోతైన అవగాహన ఉండడానికి అవకాశాలు చాలా తక్కువ. ముఖ్యంగా సామ్రాజ్యవాద ప్రభావం, అది ఉపయోగిస్తున్న భిన్న పద్ధతుల మీద , వాటి మధ్యన ఉండే అంతర్గత సంబంధాల మీద, వైరుధ్యాల మీద అంతగా అవగాహన ఉండదు. అవుతే ప్రజా చైతన్యం పెంచడం లో వాళ్లు చాలా కీలకమైన పాత్ర నిర్వహిస్తున్నారు. ఆ చైతన్యం కొత్త ఆలోచనా విధానానికి , ప్రత్యామ్నాయ నమూనాల రూపకల్పనకు అంతగా ఉపకరించకపోవచ్చు.
అరుంధతీరాయ్ మావోయిస్టులకు అవకాశం వస్తే వారు ఖనిజ సంపద పట్ల ప్రకృతి పట్ల ఎలాంటి విధానాలను అవలంబిస్తారో అనే ప్రశ్న అడుగుతున్నది. ఈ ప్రశ్న నిజానికి అడగడానికి ఇక ఆ ప్రజల్లోని వారు మిగిలి ఉన్నారనిపిస్తున్నది. వాళ్లే ప్రత్యామ్నాయ జనతన సర్కార్ గురించి మాట్లాడుతున్నారు. అది బీజ ప్రాయంలోనే ఉన్నది. తగిన చర్చ కాని, ప్రచారం కాని జరగలేదు. అయితే వాళ్లు ఇప్పుడున్న నమూనాను సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నారు. సామ్రాజ్యవాదాన్ని ఎదిరించే సాహ సం చేస్తున్నారు. అందుకే భిన్నరంగాలలో దేశవ్యాప్తంగా ఈ రాజకీయాల పట్ల నేను ఊహించని ఆసక్తి పెరిగింది. అందుకే ఆ రాజకీయాలను జాతీయ భద్రతకు పెను ప్రమాదంగా , చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడిని ఆహ్వానిస్తున్న ప్రధాన మంత్రి భావిస్తున్నాడు.
చిల్లర వ్యాపారం చర్చకు వస్తే పాలకులు ఎందు కు లక్షలాది మంది చిల్లర మనుషుల జీవితాలకు చిల్లులు వేయడానికి సిద్ధపడుతున్నారు అంటే, సామ్రాజ్యవాదం పాలకుల మీద ఎలాంటి మాయజాలాన్ని విసిరిందో అర్థంచేసుకోవాలి. ప్రజలు ఎన్నికలలో ఎవరిని ఎన్నుకుంటున్నారు అనే అంశా న్ని పక్కకు పెడితే, ఒక దేశ ప్రధానమంవూతిగా ఎవ్వరుండాలి దగ్గర నుంచి, ఏ మంత్రిత్వశాఖ ఎవరికి ఇవ్వాలి అనే దాకా ఆదేశాలు వాళ్లే ఇస్తున్నారు. వాళ్ల మనుషులకు వాళ్ల మీడియా ద్వారా కావలసిన ప్రచారాన్ని చేయిస్తారు. లేకపోతే కపిల్ సిబల్ స్వతంత్ర భారతంలో అతి గొప్ప విద్యామంత్రి అనే ప్రచారం ఎలా సాధ్యం? అబ్దుల్ కలాం, ఆజాద్, చావ్లా, హుమాయిన్, కబీర్ లాంటి ప్రముఖులకంటే ఈయన ఎలా గొప్పవాడో! అడిగే వాడేడి? దేశీయ పెట్టుబడి అంతర్జాతీయ పెట్టుబడితో మిలాఖత్ అయిన తర్వాత అంతర్జాతీయ ఆర్థికశక్తులకు మన రాజకీయాల మీద, రాజకీయ నాయకుల మీద, ఆర్థిక వనరుల మీద చాలా పట్టు లభించింది. వాళ్ల చదరంగంలో చిదంబరం, కపిల్సిబల్ లాంటి వాళ్లు పావులు. వీళ్లు సరిపోరని ఇంకొక ప్రధాన పావును కదుపు తున్నాయి.
పదేళ్ల క్రితం దేశమంతా అసహ్యించుకున్న నరేంవూదమోడీ బీజేపీలోని హేమాహేమీలను పక్కకు నెట్టి పెద్ద నేతగా అవతరిస్తున్నాడు. నరమేధం చేసిన వ్యక్తి చర్యలను ఇంత తొందరగా దేశం ఎలా మరిచిపోగలుగుతున్నదో ఆలోచిస్తే భయం వేస్తున్నది. మీడియా అలసట లేకుండా ఆయన ఇమేజీని పెంచుతున్నది. అందుకే చిల్లర వ్యాపారంలోనే కాదు, ఏ రంగంలో అయినా అంతర్జాతీయ సామ్రాజ్యవాద శక్తులు రావాలంటే తలుపులు తెరవడానికి పెట్టుకున్న ద్వారపాలకులు మన నేతలు. వీరు నిండ మునిగినా తమ దేవుళ్లు దేవాలయంతో సహా మునగడానికి సిద్ధంగా ఉన్నారు.
నీళ్లులేక పాలమూరు కన్నీళ్లు (13-9-2012)
పాలమూరు జిల్లా కరువు గురించి మాట్లాడి మాట్లాడి అలసిపోవడమే తప్ప, సమస్య పరిష్కారం జరగడం లేదు. ఆకలి, దప్పి ఉండే దాకా అలసిపోవడానికి వీలులేదు. పౌర హక్కుల సంఘం ఎన్కౌంటర్ల మీద వాస్తవ నిర్ధారణ కమిటీలలో తిరుగుతున్నప్పుడు ఒకసారి బాలగోపాల్తో ఎవరో మిత్రుడు ఎన్ని రోజులని మనం ఇలా వాస్తవ నిర్ధారణ కమిటీలు వేసి తిరుగుతుంటాం అని అంటే ‘చంపేవాడే’ అలసిపోనప్పుడు దీనిని ప్రజలకు చెప్పేవాళ్ళు అలసిపోతే ఎట్లా అన్నాడు. అలాగే పాలమూరు గురించి ఎన్నిసార్లు చెపుతారు అంటే అలసిపోకుండా నీళ్ళు వచ్చేదాకా, పాలమూరు రాజకీయ నాయకుల హృదయాలు కరిగి నీళ్ళయ్యేదాకా, ప్రభుత్వాలు సమస్యను నిర్దిష్టంగా పరిష్కరించే దాకా, పాలమూరు ప్రజలు నీళ్ళ కోసం రాజీలేని పోరాటాలు చేసేదాకా, చదివే వారికి ఎంత ఇబ్బందైనా, ఎంత విసుగు వచ్చినా, చెబుతూనే ఉండాలి. వాళ్ళే మళ్ళీ చెప్పడానికి ఇది ఒక సరైన సందర్భం కూడా. తెలంగాణ ఉద్యమం పాలమూరు సమస్యను సమక్షిగంగా అవగాహన చేసుకొని రాష్ట్రం ఏర్పడ్డాక, ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదిక మీద పరిష్కరించేలా తెలంగాణ సమాజాన్ని సంసిద్ధం చేయాలి.
పాలమూరు కరువు, వలసల వల్ల జరిగే మానవ హననానికి రాజకీయాల్లో చాలా మానవీయమైన నాయకత్వం వచ్చి ఉండవలసింది. అవి కొంత వరకు వనపర్తి బాల కిష్టయ్య,మహేంవూదనాథ్లలో కనిపించినా తర్వాత వచ్చిన నాయకత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. రాజా రామేశ్వరరావు వనపర్తి ప్యాలెస్ను పాలిటెక్నిక్ కాలేజీకి ఇచ్చి తన దాతృత్వాన్ని కొంతైనా చాటుకున్నాడు. కాని తర్వాత వచ్చిన నాయకులు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకొని లాభాల వేటలో పడ్డారు. రాజకీయాలు ఎలా దిగజారిపోయాయో అనడానికి ఇదొక మంచి ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద భూస్వాములకు, అగ్ర కులాలకు నాయకత్వ అవకాశాలు ఇచ్చిందని, ఆ పెత్తందారీ ఆధిపత్యం నుంచి బయటపడడానికి, వెనుకబడిన కులాలు, తరగతులు తెలుగుదేశం పార్టీని ఆశ్రయించాయి. ఈ పార్టీకి చాలాకాలం తిరుగులేని మద్దతునిచ్చాయి. ఎన్టీ రామారావు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నారు కూడా. ఇవన్నీ ప్రజలను భ్రమలకు గురిచేయడానికి పనికొచ్చాయి, కానీ వారి జీవితాలు మెరగుపడడానికి కాదు.
మేం పిల్లలుగా ఉన్నప్పుడు మా గ్రామంలో దాదాపు పది బావులలో ఎండాకాలం లో కూడా సమృద్ధిగా నీళ్లుండేవి. మేమందరం గంటల తరబడి ఈతలు కొట్టిన వాళ్లమే. బోలెడన్ని మంచినీళ్ల బావులుండేవి. ఈ బావుల్లో నీళ్లు ఎనిమిది, తొమ్మిది ఫీట్లలో ఉండేవి. వర్షాకాలంలో చేతులకు తగిలేంతపైకి నీళ్లుండేవి. మా ఊరి గిద్ద నిండా నీళ్లుండేవి. అవి గ్రామం గుండా ఊరి దొర భూమికి పారేవి. కానీ నిరంతరంగా పారే కాలువ గ్రామానికి ఎంతో అందాన్నిచ్చేది. హరిత విప్లవ పుణ్యమా అని మొత్తం వ్యవసాయ పద్ధతులు మారిపోవడం, విపరీతంగా నీళ్ల అవసరాలున్న పంటలను పండించడం వల్ల వ్యవసాయ పునాదులు విధ్వంసం అయ్యాయి. వందల సంవత్సరాల రైతుల అనుభవం కాని, వ్యవసాయ పంటలను విస్మరించి ‘ఫోర్డు ఫౌండేషన్’ ప్రేరేపిత వంగడాలను ప్రవేశపెట్టడం దేశ పాలకుల దివాళాకోరుతనాన్ని చాటుతున్న ది. మా బాల్యంలో మా నాన్న వచ్చిన వాళ్లందరితో జపాన్ వ్యవసాయ పద్ధతుల గురించి మాట్లాడితే, జపాన్ తరహా పంటలు పండించే వాళ్లకు ప్రభుత్వ రాయితీలున్నాయని చెప్పేవాడు. నిజానికి జపాన్లో భూ కమతాలు చాలా చిన్న వి. ఎవరికి ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండదు. జపాన్ పెట్టుబడిదారీ అభివృద్ధికి, అత్యంత సంపద సృష్టికి భూ సంస్కరణలు కూడా తోడ్పడ్డాయి.
జపాన్ను కాదని వేల ఎకరాలు సంపూర్ణ యాంత్రీకరణ ద్వారా చేసే అమెరికా నమూనాను మన రైతాంగం మీద ఏ మాత్రం దూరదృష్టి లేకుండా రుద్దడంతో వ్యవసాయ రంగం చాలా సంక్షోభానికి గురైంది. ఈ నమూనాకు కీలకం నీళ్లు. పాలమూరు జిల్లా లాంటి జిల్లాలో రైతులు నీళ్లవేటలో, చేదుడు బావులు, మోట బావుల నీళ్లు సరిపోక బోరుబావులను ఆశ్రయించారు. బోరుబావులు చిన్నపిల్లలు చనిపోవడానికి కారణమయ్యాయి. కానీ రైతుల స్థితిని మార్చడానికి, వాళ్ల జీవితాలు మెరుగుపడడానికి ఏ మాత్రం పనికి రాలేదు. ఇది సరిపోక మన దుర్మార్గ పాలకుల సామ్రాజ్యవాద ప్రేరిత వాణిజ్య వ్యవసాయాన్ని ప్రపంచీకరణలో భాగంగా ప్రవేశపెట్టారు. కొంచెం బుద్ధి ఉన్నవాళ్లైనా దీర్ఘకాలిక పరిణామాలను, పర్యవసానాల గురించి ఆలోచిస్తారు. ఆ బుద్ధి కొరవడడంవల్ల మనం పెద్ద గోతిలో పడిపోయాం.
ప్రపంచీకరణ, నూతన ఆర్థిక విధానం చిన్న కమతాలకు పనికి రాదు. వాణి జ్య పంటలు వేయడానికి పెట్టుబడి కావాలి. పెట్టుబడి అంటే అప్పు చేయవచ్చు. కానీ నీళ్లను ఎలా సృష్టిస్తారు. భూగర్భ జలాల మీద ఆధారపడ్డవాళ్లు గుర్తించుకోవలసింది, భూగర్భంలో నీళ్లేమీ నిలువ ఉండవు. ప్రతి సంవత్సరం పడే వర్షపు నీళ్లే భూమిలోకి ఇమిడి భూమి లోపల నిలువ ఉంటాయి. వర్షపాతం చాలా తక్కువగా ఉన్న పాలమూరు జిల్లా లాంటి ప్రదేశాలు, భూమి నుంచి బోరుల ద్వారా భూమిలో ఇమిడిన నీళ్లకంటే ఎక్కువ వాడడం వల్ల, నీళ్లు తగ్గి సంక్షోభం పెరిగింది. ఇలాంటి ప్రాంతాల్లో నూతన ఆర్థిక విధానం ప్రవేశపెట్టిన వ్యవసాయ పద్ధతుల తీవ్రతకు తట్టుకోలేక రెండు లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది మనకు ప్రత్యక్షంగా కనిపించిన సామ్రాజ్యవాద యుద్ధం. దేశాలనన్నింటిని తమ సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడేవిగా చేసే ‘కువూట’లో ఇదొక భాగం.
హరిత విప్లవం, నూతన ఆర్థిక విధానాల వల్ల జరిగిన ప్రమాదం నుంచి ఇప్పు డు బయట పడడం అంత సులభం కాదు. ఈ దేశం లో విప్లవం విజయవంతమైనా, ఆ పాలనకు కూడా ఇది చాలా పెద్ద సవాలే. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే నదీ జలాలను న్యాయబద్ధంగా పంచాలి. నదులు లేని ప్రాంతాల గతి ఏమిటి అంటే, అది ఒక భిన్న సమస్య. కాని నీళ్లు సమృద్ధిగా కృష్ణానదిలో దాని ఉప నదుల్లో పారుతున్న పాలమూరుకు నీళ్లు లేకపోవడం ఎంత పెద్ద విషాదం. అందుకే పాలమూరు ప్రజలకు నదీ జలాల్లో తమ వాటా అడగడం తప్ప వేరే గత్యంతరం లేదు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు పట్టించుకోనప్పుడు ప్రజా ఉద్యమాలే పరిష్కారాన్ని సాధిస్తాయి.
పాలమూరులో చాలా చైతన్యవంతమైన ఆ ఉపాధ్యాయ వర్గం, అలాగే భిన్న ప్రజా సంఘాలున్నాయి. ప్రజల హక్కుల కోసం ప్రాణాలిచ్చిన పురుషోత్తం, కనకాచారి, మునెప్ప లాంటి వాళ్లను పాలమూరు జిల్లా కని పెంచింది. చైతన్యం పెరుగుతున్న దశలో పాలకులు, పోలీసు యంత్రాంగం విపరీతమైన అణచివేతకు పాల్పడింది. మనసున్న ఏ మని షి అయినా పాలమూరు సమస్యలకు కదిలిపోతా రు. నారాయణపేటలో మేం ఒక ధర్నా కార్యక్షికమం నిర్వహిస్తే అక్కడ పనిచేస్తున్న ఆర్డీవో (నా విద్యార్థి) మాతో పాటు టెంటులో కూర్చుంది. వృత్తిపరమైన సమస్యలుంటాయి అని నేనంటే, పాలమూరు సమస్యలను చూసిన ఎవ్వరైనా ఇలా కూర్చోవలసిందే అన్నది.
ఈ నెల 15,16 తేదీలలో పాలమూరు ప్రజల ఉద్యమాల కొనసాగింపుగా, పాలమూరు అధ్యయన వేదిక 30 గంటల పాలమూరు జల సాధన దీక్ష శిబిరా న్ని నిర్వహిస్తున్నది. దీనిలో ప్రముఖులు, పాలమూరు అవస్థను చూసిన చుక్కా రామయ్య, రాంచంవూదమూర్తి, పొత్తూరి వెంక లాంటి వాళ్లే కాక, కవు లు, కళాకారులు పాల్గొంటారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహిస్తు న్న కోదండరాం వస్తారు. పాలమూరు నీటి సమస్య తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రధానమైన అంశంగా మారాలి. మరోసారి చెప్పాలంటే కరువు కాటకాలున్న ప్రాంతానికి ప్రజా చైతన్యమే పరిష్కార మార్గం. పాలమూరు భవిష్యత్ స్వప్నాన్ని నీళ్లు పోసి పెంచేలా అందరం కృషి చేద్దాం.
మళ్లీ నిషేధ రాజకీయాలు (23-8-2012)
మన రాష్ట్రంలో రెవల్యూషనరీ డెమొక్షికాటిక్ సంస్థ (ఆర్డీఎఫ్)ను నిషేధించడం తొందరపాటు చర్యే. రాజకీయ విశ్వాసాలను, ఆ విశ్వాసాలున్న సంస్థలను నిషేధించడం మన రాష్ట్రానికి కొత్తేమీ కాదు. విప్లవ ఉద్యమాలు ముందుకు తీసుకవచ్చిన మౌలిక ప్రజా సమస్యలను పరిష్కరించలేని రాజకీయ వ్యవస్థ, ఆ మౌలిక సమస్యలను లేవనెత్తుతున్న రాజకీయాలను నిషేధించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. విప్లవ పార్టీలనే కాక పార్టీల పట్ల సానుభూతి కలిగిన సంస్థలను, వాటికి ఫ్రంట్ ఆర్గనైజేషన్ అని పేరుపెట్టి, వాటి సాహిత్యాన్ని, పుస్తకాలను నిషేధించే ఒక అప్రజాస్వామిక సంస్కృతి రాష్ట్రంలో ఉంది. నిషేధ రాజకీయాలు భూస్వామ్య, వలసవాద పద్ధతులు. ఇలాంటి పద్ధతులకు వ్యతిరేకంగా స్వాతంవూత్యోద్యమం నడవడం వల్ల ఆ ఉద్యమంలో ముందుకు వచ్చిన ప్రజాస్వామ్య ఆకాంక్షల వెలుగులో భారత రాజ్యాంగం రూపొందించబడింది. దాదాపు రెండున్నర సంవత్సరా ల కాలం మేధోమథనం చేసి అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ రూపకల్పన జరిగింది.
స్వతంత్ర దేశంలో ప్రజలే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటార ని, ప్రజలు స్వేచ్ఛగా స్వతంవూతంగా తమ సమస్యలు చెప్పుకోవచ్చని, సంఘటితంగా సంఘాలు పెట్టుకోవచ్చని, ఉద్యమాలు చేపట్టవచ్చని రాజ్యాంగం హామీ ఇచ్చి, హక్కులు కల్పించింది. భావ ప్రకటన స్వేచ్ఛకు దాదాపు మూడు శతాబ్దాల చరిత్ర ఉంది. సోక్రటీస్, జీసస్, గెలీలియో కోపర్నికస్, భ్రూనోల సాహసం నుంచి, లక్షలాది ప్రజల పోరాటాల నుంచి భావ ప్రకటనా స్వేచ్ఛ ఒక వ్యవస్థీకృతమైన ప్రజాస్వామ్య విలువగా మానవ చైతన్యం లో భాగమైంది. పైన ఉదహరించిన సాహసవంతులు తమ స్వేచ్ఛ కోసం, తాము నమ్మిన విశ్వాసాల కోసం, తాము సత్యమనుకొని నమ్మిన సత్యాన్ని అప్పటి పాలకవర్గాలకు కంటగింపుగా ఉన్నా ప్రపంచానికి చాటారు. ఈ అంశం మీద నేను చాలా సందర్భాల్లో పేర్కొన్న జేఎస్ మిల్ స్వేచ్ఛ మీద రాసిన గ్రంథం ప్రామాణికం గా పరిగణింపబడుతున్నది. మానవాళి సత్యాన్వేషణలో ఉన్నప్పుడు ఎలాంటి భావాలను నిరోధించినా అది మానవ నాగరికత పరిణామ క్రమానికి ప్రమాదమని స్వేచ్ఛా సిద్ధాంతం భావిస్తుంది.
స్వాతంవూత్యోద్యమ కాలంలో మన దేశంలో ఈ విలువ చాలా ప్రసవవేదన తర్వాతే పుట్టిం ది. గాంధీ రాసిన ‘హింద్ స్వరాజ్’ను అప్ప టి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. అలాగే రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఉద్యమమే జరిగింది. ఈ కాలంలోనే భిన్న భావాలు ముందుకు వచ్చాయి. మార్క్సి స్టు సిద్ధాంతం, ఎంఎన్ రాయ్, లోహియా, డాక్టర్ అంబేద్కర్, జయవూపకాశ్ నారాయణ, అలాగే హిందూమత ఛాందసత్వానికి చెందిన సావర్కర్, గోల్వాల్కర్ రచనలు కూడా వచ్చాయి. మనం అన్ని భావాలతో ఏకీభవించకపోవచ్చు. కానీ ఆ భావా లు చెప్పే స్వేచ్ఛ వాళ్లకుండాలి. అంతిమంగా ప్రజలు ముఖ్యంగా శ్రామిక జనం దేన్ని విశ్వసించి పోరాడితే ఆ విలువలు సమాజాన్ని ముందుకు నడిపిస్తాయి. ఈ మొత్తం వారసత్వం ఏమైంది? ఎక్కడ మునిగిపోయిందో అడగవలసిన అగత్యం ఏర్పడింది.
మన రాష్ట్రంలో నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి నిషేధ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే నక్సల్బరి పోరాటాన్ని పాలకులు ఎప్పు డూ ఇది కేవలం శాంతి భద్రతల సమస్య అని భావించలేదు. పాలించే వాళ్ల కు దీని మూలాలు ఎక్కడ ఉన్నాయో అని తెలియక కాదు. అది వాళ్లకు పూర్తి గా తెలుసు కాబట్టే ఇంత భయం. సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానత ల నుంచి, అణచివేత నుంచి ఈ ఉద్యమాలు పుట్టాయని ఏలిన వారికి తెలు సు. తెలిస్తే అసమానతలు తగ్గించవచ్చు కదా, భూమిని పంపిణీ చేయవచ్చు కదా, ఆదివాసీల హక్కులను గుర్తించి, రాజ్యాంగ స్ఫూర్తితో వాళ్ల వనరులు వాళ్లకే దక్కేలా చూడవచ్చు కదా. ఇది చేయడం స్వప్రయోజన పరులకు ఇష్టం ఉండదు. అశాంతిమయమైన హింసా ప్రపంచంలో అభవూదతతోనైనా జీవిస్తారు. కానీ కొన్ని ప్రయోజనాలనైనా వదులుకొని ఒక సజీవ శాంతియు త సమాజంలో జీవించాలనే స్పృహ వాళ్లకుండదు. విపరీతమైన ఆస్తికాంక్ష, లాభాల వేటలో ఉండే వాళ్లలోని మనిషి మాయమైపోయి ఉంటాడు. అందు కే వాళ్లు బలవూపయోగాన్ని, హింసను కోరుకుంటారు. హింసద్వారా ప్రజల ఆకాంక్షలను అణచివేయాలనుకుంటారు. అక్కడే ఆగరు. ఆ ఆలోచనలనే తుంచి వేయాలనుకుంటారు.
నిజాయితీగా ప్రశ్నలడిగే వారు చాలా భయంకరంగా కనిపిస్తారు. రోజు వాస్తవాలను వక్రీకరించే మీడియాను సృష్టించుకుంటారు.వాళ్లు రోజూ ప్రచారం చేస్తున్న సమాచారం నిజమని భ్రమింప చూస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా , అంతిమంగా మనిషి తన సామాజిక అనుభవం నుంచి వాస్తవాలను గ్రహిస్తాడు. ఆ అనుభవపు వెలుగులో ముందుకుపోతుంటాడు. ఆలోచనలను, భావాలను, సంస్థలను నిషేధించ డం వల్ల మార్క్స్ అన్నట్లు.. అవి పాలకులు ఆశించిన ప్రయోజనాలకు భిన్నంగా మనిషి చైతన్యాన్ని మరింత పదును చేస్తాయి. ఒక పుస్తకాన్ని నిషేధించడం వల్ల ఆ పుస్తకం చదవాలి అనే ఆసక్తి పెరుగుతుంది. ఒక సంస్థను నిషేధిస్తే, ఆ సంస్థ గురించి పట్టించుకోని వారు కూడా ఈ సంస్థను ఎందుకు నిషేధించారు అని చర్చించుకుంటారు. నిషేధాలు ఎప్పుడూ పాలకుల ప్రయోజనాలకు వ్యతిరేకంగానే పనిచేస్తాయి.
మన రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు రాజకీయాలను ప్రవేశపెట్టిన వారిలో వెంగళ్రావు ఆద్యుడు. ఆ రోజుల్లో సమర్థవంతమైన ముఖ్యమంత్రి అని చాలా ప్రచారం చేశారు. ఎన్కౌంటర్లను ప్రోత్సహిస్తే పాలక వర్గాలు సంబరపడ్డాయి. ఆయన అణచాలన్న రాజకీయాలు దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నా యి. అది దేశ భద్రతకే పెద్ద ముప్పు అని భావించేదాకా ఎదిగాయి. కానీ వెంగళ్రావును ఎవరు గుర్తు పెట్టుకున్నారో మనకు తెలియదు. ఆణచివేతను కొనసాగించినా, రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చినందుకు ఎన్టీఆర్ను గుర్తుపెట్టుకున్నారు. కొంచెం వెసులుబాటు కల్పించినా జ్ఞాపకం పెట్టుకునే ఈ ప్రజల మీద దాడులు అణచివేతలు చేయడం పాలకుల అజ్ఞానం.
మన రాష్ట్రంలో నక్సలైట్ పార్టీలకు, ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు జరిగాయని ప్రభుత్వం మరిచిపోయినా, ప్రజలకు గుర్తుండే ఉంటుంది. ఇది ‘పౌర సమాజం’ చొరవ మీద ఏడు, ఎనిమిది ఏళ్ల నిరంతర కృషి మేరకు జరిగింది. అడవి నుంచి అగ్రనాయకులు హైదరాబాద్లో ప్రభుత్వ అతిథులుగా ఉండి, కొన్ని మౌలికమైన అంశాలను చర్చకు పెట్టారు. అందులో ముఖ్యంగా ప్రజాస్వామిక హక్కుల మీద చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. రాజకీయాలను, విశ్వాసాలను ప్రచారం చేసుకునే హక్కు పరిధి పెంచాలని, పాలకులు తాము రాసుకున్న రాజ్యాంగాన్నైనా గౌరవించాలని, ఆ హక్కులు ప్రజలు అనుభవించాలంటే ఒక రాజకీయ పరిస్థితిని కల్పించాలని డిమాండ్ చేశారు. పౌరస్పందన వేదిక ప్రజాస్వామ్యచోటు పరిధి పెరిగితే హింస తగ్గుతుందని చాలా బలంగా విశ్వసించి అంత పెద్ద ప్రయత్నం చేసింది. ఇంత పెద్ద ప్రయోగం జరిగిన రాష్ట్రంలో మళ్లీ రెవల్యూషనరీ డెమోక్షికటిక్ ఫ్రంట్ లాంటి జాతీయ జాతీ య సంస్థను ఏపీ పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ కింద నిషేధించడమేమిటి? ఇప్పుడు మన రాష్ట్రంలో అంత బలమైన నక్సలైట్ ఉద్య మం లేదు కదా, నక్సలైట్లు అభివృద్ధికి ఆటంకం అని ప్రచారం చేసిన వారు, ఇప్పుడు తాము పదేపదే చెబుతున్న అభివృద్ధిని చేపట్టవచ్చుకదా! ఆర్డీఎఫ్ లాంటి ప్రజాస్వామిక సంస్థ ముందుకు తెచ్చిన వాదనలకు జవాబు చెప్పవచ్చు కదా.
మన రాష్ట్రంలో నక్సలైట్ ఉద్యమం పూర్తిగా సమసిపోయింది అని కేంద్ర హోం మంవూతికి చెబుతున్నా మన ప్రభుత్వానికి కొందరు కవులు, రచయితలు, ప్రజాస్వామికవాదులు నిరాయుధంగా రాజకీయా లు మాట్లాడుతుంటే అంత భయమెందు కు? ఉద్యమం మళ్లీ పుంజుకోవచ్చు అని అనుకుంటే అది మళ్లీ రావలసిన అవసరం లేని పరిస్థితులు కల్పించవచ్చుకదా. నిషే ధం ప్రజల అవసరాలకు, అంతరాలకు జవాబు ఎలా అవుతుంది. ప్రపంచీకరణ సామ్రాజ్యవాద ప్రేరిత అభివృద్ధి నమూనాను అమలు చేసినంత కాలం ఉద్యమాలు ఏదో రూపంలో జరుగుతూనే ఉంటాయి. అమెరికాలో వాల్స్ట్రీట్ ఆక్రమించుకోండి అన్న ఉద్యమం వెనక ఏ నక్సలైట్లు ఉన్నారు? అది శాంతియుత పోరాటం అని భావిస్తే, అమెరికాలో ప్రతి పౌరుడి దగ్గర ఆయుధముంది. వాళ్ల రాజ్యాంగంలోనే ఆయుధాన్ని కలిగి ఉండే హక్కును రాసుకున్నారు. అమెరికన్ ప్రజల సహనం నశిస్తే, అది సాయుధ పోరాటం గా మారడానికి ఎక్కువ సమయం పట్టదు.
నిజానికి ఆర్డీఎఫ్ మన రాష్ట్రం లో గ్రీన్హంట్కు వ్యతిరేకంగా ఒక సభ జరిపింది. సభలో మాలాంటి వాళ్లం పాల్గొన్నాం. ఛత్తీస్గఢ్లో కలెక్టర్ అపహరణ సందర్భంలో ఈ దుర్మార్గాన్ని గురించి అడిగితే అక్కడి ముఖ్యమంత్రి గ్రీన్హంట్ అనేటువంటి చర్య తమ రాష్ట్రంలో లేనేలేదని అన్నాడు. లేకపోతే దాని గురించి మాట్లాడేవారి విశ్వసనీయత దెబ్బతింటుంది కదా. ఆర్డీఎఫ్ అలాంటి సభ ఒకటి ఢిల్లీలో పోలీసుల అనుమతితో పార్లమెంటు స్ట్రీట్లో పెట్టింది. ఆ సభ కు హాజరైన వారిలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, ప్రజాస్వామికవాదులు, అలాగే న్యాయమూర్తి రాజేంద్ర సచార్ మాట్లాడారు. ఇంత పారదర్శకంగా పాలకులు అంటున్న ప్రజాస్వామ్య గొడుగు కింద పనిచేస్తున్న సంస్థను నిషేధించడమనేది చరివూతకు వ్యతిరేకంగా ప్రయాణించడమే. ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం ఒక రాజకీయ స్పృహతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని, అలా ఒత్తిడి తేవడానికి తెలంగాణ కోసం పోరాడుతున్న రాజకీయ శక్తులు కూడా కృషి చేస్తాయని ఆశిద్దాం.
పొంగి పొరలిన తెలంగాణ ప్రజాచైతన్యం (15-8-2012)
అల్లం సోదరులకు కన్నతల్లి జన్మనిస్తే, కరీంనగర్ పోరాటాలు మరో జన్మనిచ్చాయి. ముగ్గురు సోదరులు (రాజయ్య, వీరయ్య, నారాయణ) సృష్టించిన సాహిత్యము, చేసిన విశ్లేషణ తెలంగాణ చైతన్యంలో అంతర్లీనంగా ఉండడమేగాక పరిణామక్షికమంలో అవి తమవంతు చారివూతక పాత్రను నిర్వహిస్తున్నాయి.నూతన సామాజిక సంబంధాలు ఏర్పడేదాకా ఆ సాహిత్యం అలా సజీవంగానే ఉంటుంది. చాలా ఇతర సందర్భాల్లో నేను పంచుకున్న ఫీలింగ్స్లో వ్యక్తులు సామాజిక చైతన్యాన్ని ఎంత ప్రభావితం చేస్తారో, సామూహిక చైతన్యం వ్యక్తులను ఎలా మలుచుకుంటుందో నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదు కాని- వ్యక్తుల ప్రభావం సామాజిక చైతన్యీకరణ పైనా ఉంటుంది అని అంగీకరిస్తే, ఈ ముగ్గురు సోదరులు నిర్వహించిన పాత్ర నిస్సందేహంగా గొప్పదే.అల్లం రాజయ్య కథ-నవలల్లోనూ, అల్లం వీరయ్య గేయ సాహిత్యంలోనూ, నారాయణ కవిత్వం-రాజకీయ విశ్లేషణల్లోనూ.. ఇలా భిన్నవ్యక్తిత్వాలకి తగ్గట్టుగా భిన్నమైన సాహిత్య ప్రక్రియలు ఎన్నుకున్నారు. నారాయణ స్వయంగా ఆయుధం పట్టుకుని ప్రత్యక్షంగా ఉద్యమాలలో పాల్గొన్నవాడూ, రాజ్యహింసను అనుభవించిన వాడు. ఆయన వ్యాసాలు చదువుతుంటే, ఒక కవికుండే సున్నితమైన మనస్తత్వంతో కవిత్వమో వచనమో తేల్చుకోవడం సాహిత్యంతో గాఢ పరిచయం లేని నాలాంటి వాడికి కష్టంగానే ఉంటుంది. ప్రతి వ్యాసాన్ని- ఒకసారి దాని పొయటిక్ బ్యూటీకి, పొంగిపొరలిన ఆవేశం కొరకు.. మరోసారి విశ్లేషణ కొరకు చదివాను.నారాయణ చేతిలో భాష భావాలకి తగ్గట్టుగా ఒదిగిపోయింది. భాష ఆయన చెప్పినట్లు వినడం తప్ప ఆయన రచనకు ఎక్కడా పరిమితి కాలేదు, ప్రతిబంధకం కాలేదు. చదివేవాళ్లకి ఇలాంటి సుసంపన్నమైన భాషాజ్ఞానం మనక్కూడా వుంటే ఎంత బావుండునో అనిపిస్తుంది.ఈ వ్యాసాలు చాలా అంశాలనే చర్చించాయి. కానీ మూడో నాలుగో అంశాలు చాలా ప్రధానంగా ఆలోచనలని కుదిపి, అంతరంగానికి తగిలి కదిలించేలా ఉన్నాయి.
ప్రజాఉద్యమాలు, విప్లవ పోరాటాలు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం.. ప్రపంచీకరణ దుర్మార్గం.. అరుదైన కొందరు వ్యక్తుల పాత్రపై నారాయణ అంచనా - ఈ కోవలోకి వస్తాయి. తన గ్రామం గురించి, తన అనుభవాల గురించి వ్రాసిన జ్ఞాపకాలలో ఒక రకమైన నోస్టాల్జియా కనిపిస్తుంది. విప్లవోద్యమాల గురించిన రచనల్లో ఇంద్ర దగ్గర ప్రారంభించి సమకాలీన విప్లవ ఉద్యమాన్ని కూడా స్పృశించినా, ఆయన ఇంకా రాయవల్సింది మిగిలే ఉందనిపిస్తుంది. ఇందు లో ఆరుట్ల జ్ఞాపకాలు దానితో ముడిపడిన త్యాగాల చరివూతను గుర్తుచేస్తాయి. అలాగే సమ్మక్క సారక్కల తిరుగుబాటు దాని విశిష్టతలను, తెలంగాణ పోరాట వారసత్వాన్ని ‘జనవనం మనాది’ గుర్తుచేస్తుంది. సెప్టెంబర్ 17 మీద వ్యాసం కనువిప్పు కలిగించేలా ఉంది. చరివూతలో ఒక సంఘటనని ఎలా చూడాలో, ఏ కోణం నుంచి పరిశీలించాలో ఆ వ్యాసం చదివితే తెలుస్తుంది. ఉద్యమ విశిష్టతలే కాక, దాని పెదధోరణులను- విభేదాలను, స్వార్థాన్ని, స్వప్రయోజనాన్ని, ‘అహం’వూపభావాన్ని- అంతే నిజాయితీగా ఎత్తిచూపాడు. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పట్ల నారాయణకుండే కన్సర్న్, కమిట్మెంట్ అత్యంత బలంగా, ఆవేశపూరితంగా ఈ రచనల్లో కనిపిస్తాయి.నిజానికి ప్రధాన స్రవంతిగా ప్రవహించిన ప్రాణహిత అదే. దీంట్లో తెలంగాణలో జరుగుతున్న విధ్వంసం, తెలంగాణ మీద జరిగిన అణచివేత, దోపిడీ, అంతర్గత సామాజిక సంబంధాలు.. ఇలా చాలా చాలా అంశాలున్నాయి. ఉదాహరణకు పాలమూరు జిల్లాలో బాలస్వామిని హత్య చేసిన పద్ధతి, ఇతర కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలు, అలాగే ‘కరువు అరిగోస’లో ఆ జిల్లా అనుభవిస్తున్న వేదనామయ జీవితాన్ని హృద్యంగా చెప్పాడు. తెలంగాణ అభివృద్ధి ఎంత సంక్షోభంలో ఉందో, దేవాదుల ప్రాజెక్టు ఒక మృగతృష్ణగా ఎలా మారిందో వివరించాడు. తెలంగాణ ఉద్యమాన్ని భిన్నకోణాల నుండి చూసే పెద్ద కృషి ఉంది- కొన్ని వ్యాసాలు చాలా ఆవేశంతో రాసినవి, కొన్ని విపరీతమైన ఆవేదనతో రాసినవి, కొన్ని సమస్యల మూలాల్లోకి వెళ్లినవి.
ఈ ఉద్యమ క్రమంలో జరిగిన ఆత్మబలిదానాలు, వాటిని ఆపడానికి తన సృజనాత్మక శక్తినంతా ఉపయోగించి రాసిన మనసు కదిలించే వ్యాసాలున్నాయి. ఇక తెలంగాణ రాజకీయ నాయకుల మోసాలను, ద్రోహాన్ని, స్వార్థాన్ని, అవినీతిని,అబద్ధాలను, అవకాశవాదాన్ని, అమ్ముడుపోవడాన్ని ఉతికి పారేశాడు. ఇంతటి విమర్శనాత్మక వ్యాసాలు ఇంత సూటిగా, ఇంత వేడిగా వాడిగా ఇంతవరకూ ఎవరూ రాయలేదు. రాయలేక పోవచ్చుకూడా. ఇది ఒక రకంగా తెలంగాణను ప్రేమించిన ఒక ప్రతిభావంతమైన జర్నలిస్టు రాజకీయ నాయకులు చేసుకోవాల్సిన ‘ఆత్మవిమర్శ’ గురించి చేసిన శంఖారావం లాగుంది. మరీ నిస్సహాయంగా ఫీల్ అయినప్పుడు వ్యంగ్యంగా రాశాడు. అసహాయతని, ఆగ్రహాన్ని వ్యక్తీకరించే ఒక రచనా పద్ధతిగా వ్యంగ్యాన్ని వాడాడనిపిస్తుంది. ఈ వ్యాసాల్లో సోనియమ్మకు లేఖ, మిస్టర్ చీఫ్ మినిస్టర్ అంటూ రాజశేఖర్డ్డికి రాసిన లేఖ హైలైట్స్గా ఉన్నాయి.తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న ప్రపంచీకరణ సందర్భం కూడా చాలా ముఖ్యం. నారాయణకి స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం ఉంది. కాబట్టే, తెలంగాణను కేవలం అస్తిత్వానికీ పరిమితం చేయకుండా, దాని విస్తృతిని కూడా చూడగలిగాడు. ప్రపంచీకరణ చేస్తున్న విధ్వంసాన్ని సింగరేణి ఓపెన్ కాస్ట్ల మీద, రైతుల ఆత్మహత్యల మీద ఎలా ప్రతిఫలిస్తుందో చాలా ఆగ్రహంతో రాశాడు. అలాగే హైదరాబాద్ నగర జ్ఞాపకాలు రాస్తూ... పెరుగుతున్న రియల్ ఎస్టేట్ల వ్యాపారాన్ని, కాలుష్యంతో ముంచెత్తుతున్న నగర విధ్వంసక పారిక్షిశామిక విధానాలని నిరసిస్తూ ఎంతో హృదయవేదనతో రాశాడు. లోపిస్తున్న మానవీయ విలువల పట్ల కరుణతోనూ, కసిగానూ రాశాడు. ప్యారడైజ్లాస్ట్, ఆర్ట్స్ కాలేజీ జ్ఞాపకాల్లో ఈ ఆందోళన కనిపిస్తుంది. విశిష్ట వ్యక్తులుగా కాళోజీ, బాలగోపాల్ల గురించి రాస్తూ, వాళ్ల పట్ల నారాయణ తనకున్న గౌరవాన్ని బాగా వ్యక్తీకరించాడు. ‘ఇప్పుడు రక్షకుడు లేడు’ అని కాళోజీమీద, ‘మనకాలపు పరిపూర్ణ మానవుడు’ అని బాలగోపాల్ మీద రాసిన వ్యా సాల్లో శీర్షికనుంచి చివరి దాకా ఆ లోటుని, గౌరవాన్ని ఎంతో ఉన్నతంగా వ్యక్తీకరించాడు. అలాగే ‘పాటని బంధించడమా’అని గద్దర్ గురించి, ‘కన్నీటి కలత’ అని చుక్కారామయ్య గారి గురించి భావోద్వేగంతో రాశాడు. ప్రాణహితలో అల్లం నారాయణ వ్యక్తిత్వాన్ని, ఆయన ఆవేశ కావేశాలని మనం చూడడమే కాక, నడుస్తున్న చరివూతలోని ఒక సామాజిక, చారివూతక ఉద్యమ స్ఫూర్తిని కూడా చూస్తాం. వీటిని యాంత్రికంగా చదవలేరు. మనసు పెట్టి చదివితే నారాయణ ఆలోచనలతో, ఆగ్రహంతో, ఆవేదనతో.. కలిసో, కలబడుతూనో సాగవలసిందే. దేశవ్యాప్తంగా జర్నలిజం ప్రమాణాలు దిగజారుతూ, ఫాసిజంవైపు దేశం నెట్టబడుతున్న సందర్భంలో ఈ పుస్తకంతో తెలుగు జర్నలిజానికి నారాయణ అందించిన ప్రాణహితే కాదు, ప్రాణవాయువు కూడా.
(‘ప్రాణహిత’ పుస్తకానికి రాసిన ముందుమాట)
Subscribe to:
Comments (Atom)