Sunday, October 28, 2012

బి.డి. శర్మ:అరుదైన ఐఏఎస్ (17-5-2012)

‘నమస్తే తెలంగాణ’ కాలమ్‌కు రాయడంలో కొంత గ్యాప్ వచ్చింది. మిగతా కారణాలతో సహా ఛత్తీస్‌గఢ్‌లో కలెక్టర్ అలెక్స్ పాల్ మీన న్ కిడ్నాప్‌లో మధ్యవర్తిగా వెళ్లవలసి రావడం వల్ల కూడా జాప్యం జరిగింది. ఇప్పుడు కూడా సీరియస్‌గా రాసే ఒక మానసికస్థితి ఏర్పడలేదు. మధ్యవర్తి త్వం నిర్వహించిన తర్వాత సాధారణ మానసికస్థితి రావడానికి సమయం పడుతుంది. ఇది గతంలో కూడా నాకు అనుభవమే. అయితే ఏదో రాయడ మో, లేదా ఏదో ఒక సభలో ప్రసంగించడమో చేస్తే తప్ప అతి త్వరగా సాధారణ స్థితి రాదు. ఒరిస్సా కిడ్నాప్ తర్వాత పాలమూరు అధ్యయన వేదిక తెలంగాణ చరిత్ర మీద నిర్వహించిన నభనుద్దేశించి మాట్లాడుతున్న క్రమంలో కొంత సాధారణ స్థితి వచ్చింది. ఈసారి సెక్ర ఆఫీసర్స్‌ను ఉద్దేశించి పాలనా సంస్కరణల మీద మొన్నటి ప్రసంగంతో కొంత కుదుట పడడం వల్ల మొదటిసారిగా చేసే ప్రయత్నమిది. ఛత్తీస్‌గఢ్ మధ్యవర్తిత్వం నేనింత వరకు పాల్గొన్న అనుభవాలతో పోలి స్తే బహుశా ఇది మిగతా వాటి కంటే కఠినమైన సమస్య. అంత కష్టంగా ఉంటుందని నేను భావించలేదు. అయితే ఇలాంటి అనుభవాన్ని ‘జ్ఞానం’గా చూడాల ని ఆర్.ఎస్.రావు అనేవారు. గతంలో 1993 కొయ్యూర్ కిడ్నాప్ ఘటనలో కన్నబీరన్‌తో, 1996 నుంచి 2004 వరకు శాంతి చర్చల ప్రయత్నంలో శంకరన్, పొత్తూరి వెంక ఇతర మిత్రులతో, గత సంవత్స రం ఆర్.ఎస్. రావు, దండపాణి మొహంతితో, ఈ ఛత్తీస్‌గఢ్‌లో డాక్టర్ బ్రహ్మదేవ శర్మ (బీడీ శర్మ)తో కలిసి కృషి చేసే అవకాశం కలిగింది. వీళ్లందరిలో దండపాణి, బీడీ శర్మలు తప్పించి, మిగతా వాళ్లంతా తెలుగు సమాజానికి పరిచితులే. ఆత్మీయు లే. ఛత్తీస్‌గఢ్ అనుభవాలను పంచుకోవలసిన అవసరము, బాధ్యత నా మీద ఉంది. అది తప్పక చేయాలి. ఈసారి ఎందుకో బీడీ శర్మ గురించి తెలుగు సమాజానికి, ముఖ్యంగా ఒక ఉద్యమంలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెప్పడం ప్రారంభించడం ప్రయోజనకరంగా ఉంటుందని అనిపించింది. బీడీ శర్మ మధ్యవూపదేశ్‌లో ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన బాలగోపాల్ లాగే ఎంఎస్సీ గణితశాస్త్రం చేసి, అందులో డాక్టరేట్ కూడాపూర్తి చేశారు. సివిల్ సర్వీస్‌తో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం తో చేరారు. సివిల్ సర్వెంట్‌గా బహుశా స్వాతంత్య్రం తర్వాత శంకరన్‌తో సరిసమానం తూగేలాగా ప్రజలకు అద్భుతమైన సేవలు అందించారు. కొన్ని ఆయ న చేసిన ప్రయోగాలు, ముఖ్యంగా ఆచరణ నాలాంటి వాడికి ఊహకు అందని విధంగా ఉంది. నాకు ఆయన గురించి శంకరన్ చెప్పేవారు. అయితే రాడికల్ రాజకీయాల పట్ల ఆయనకు అభిమానం ఉంది. కానీ ఆ రాజకీయ ప్రక్రియలో ఉండే మెలికలు, అంతర్గత అంశాలు కొన్ని సున్నితమైన సమస్యల పట్ల ఆయనకు సమక్షిగమైన అవగాహన తక్కువ. లేదా దాని గురించి ఆయన ఎక్కువగా పట్టించుకోడు అని శంకరన్ అనేవారు. అయితే శర్మ ఎప్పు డు హైదరాబాద్ వచ్చినా శంకరన్ దగ్గరే ఉండేవారు. ఇద్దరి మధ్యన సాన్నిహిత్యమే కాక సున్నితమైన హాస్యముండేది. శంకరన్ అప్పుడప్పుడూ నీవు ఎవ్వరి మీటింగ్‌కు వచ్చావు, మీటింగ్ ఎక్కడ? ఆ పార్టీ ఏ పార్టీ? ఇలా అడిగేవాడు. శర్మ ఎవరైతే ఏం, ప్రజల కోసం పనిచేస్తున్న వాడిగా నా అభివూపాయాలు నావి, వాటిని స్వేచ్ఛగా చెబుతాను అని అనేవారు. శర్మ వెళ్లిపోయిన తర్వాత చూశా వా ఆయనకు ఏ వివరాలు తెలియవు. ఈ పార్టీల మధ్యన తగువులున్నాయి, దృక్పథాలలో తేడాలున్నవి, వాటి గురించి కొంచెమైనా తెలిసి ఉండడం అవసరం అని శంకరన్ అనేవారు. అలా బీడీ శర్మ నాకు పరిచయమయ్యారు. ఛత్తీస్‌గఢ్ సంఘటన సందర్భంగా ఆయనతో కలిసి దాదాపు తొమ్మిది రోజు లు పనిచేయవలసి వచ్చింది. ఈక్రమంలోనే బీడీ శర్మ అపూర్వ వ్యక్తిత్వం చూసే గొప్ప అవకాశం వచ్చింది. ఆయన ఇప్పుడు ఆరు, ఏడు జిల్లాలుగా ఏర్పడిన అప్పటి అతిపెద్ద బస్తర్ జిల్లాకు నలభై సంవత్సరాల కిందట కలెక్టర్ గా పనిచేశారు. బస్తర్‌ను తన సొంత ప్రాంతంగా, బస్తర్ ఆదివాసీలను తన మనుషులుగా చూసి, నిష్కల్మషంగా ప్రేమించిన మనిషి. నిజానికి బస్తర్ ఆదివాసీల నిష్కల్మష జీవితం కూడా ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించి ఉంటుంది. అక్కడి ఆదివాసీలను నేను పొరపాటున పేద ఆదివాసీలు అంటే పేద ఆదివాసులు ఉండరు అన్నాడు. మేం ఆదివాసీలతో మాట్లాడుతున్న సందర్భంలో మీ భాషలో పేదరికాన్ని ఏం అంటారు అని అడిగి ఆ పదం వాళ్ల భాషలో లేదు అని చెప్పారు. వాళ్ల భాషలో భవిష్యత్తు అనే పదం కూడా లేదు అంటూ, జీవితాన్ని నిరంతరం పారుతున్న నిష్కల్మష నదీ ప్రవాహంగా జీవిస్తారు అని వివరించాడు. నిజానికి వాళ్ల మీద ఆయన ప్రేమ అనిర్వచనీయమైంది. వాళ్ల మధ్య చిన్న పిల్లవాడిలా, ఒక వేడి రక్తం కలిగిన యువకుడిగా మారిపోయాడు. వాళ్ల చేత నినాదాలు అనిపించాడు. ప్రమాణాలు చేయించాడు. వాళ్ల మహువా తప్పించి, బయటి నుంచి వచ్చే మద్యాన్ని కూడా తాగవద్దని ప్రమాణాలు చేయించాడు. మావోయిస్టు కార్యకర్తలు బిస్కట్లు ఇస్తే, బస్తర్‌కు బిస్కట్లు ఎలా రానిచ్చా రు. నేను బస్తర్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు బిస్కట్లను తినవద్దని వారించాను. ఆదివాసీ ప్రాంతాల వనరులను దోచి బిస్కట్లు తయారుచేసి, వాటిని ఆదివాసు లకు తినిపించి దోపిడీని స్థిరపరుచుకుంటున్నారు అన్నారు. ప్రకృతి ఇచ్చిన ఇన్ని రకాల పండ్లు, ఫలాలు ఉన్నప్పుడు బిస్కట్లు తినవలసిన దుర్గతి వీళ్లకెందుకు అని అన్నాడు. బీడీ శర్మకు సుఖము, సౌకర్యాలు ఏవీ పట్టవు. ఇవి నిజానికి బాలగోపాల్ తో పోల్చదగిన గుణాలే. కారులో ఏసీ వేస్తే, డ్రైవర్‌పై కోప్పడ్డాడు. నీవు ఇక్కడ ఏసీ వస్తే ఒక ఆదివాసికి మంచినీళ్లు దొరకవు నీకు తెలుసా అని అన్నాడు. అడవిలో మేం కొంత దూరం నడవవలసి వచ్చింది. ఎనభై ఏళ్లు దాటిన తాను నాకంటే వేగంగా నడవడం ప్రారంభించాడు. నాకు బైపాస్ అయ్యింది. మీ అంత వేగంగా నడవకూడదేమో అంటే తనకు 17 ఏళ్ల కిందటే బైపాస్ అయ్యిందన్నప్పుడు నాకు కొంచెం సిగ్గుకూడా వేసింది. అడవిలో మేం ఒక రాత్రి ఆదివాసీల మధ్య గడపవలసి వచ్చింది. వాళ్ల దగ్గర చిన్న చిన్న మంచాలున్నాయి. ఈయన చాలా పొడవు, కొంత సేపు నేల మీద గురకపెట్టి నిద్రపోయాడు. తర్వాత మంచం మీద ముడుచుకు ని నిద్రపోయాడు. రెండవసారి మేం కలెక్టర్‌తో తిరిగి వచ్చాక సీఆర్‌పీఎస్ క్యాంపులో ఒక రాత్రి ఉండవలసి వచ్చింది. మాకిద్దరికి ఒక చిన్నగది ఇచ్చారు. గదంతా చాలా వేడిగా ఉంది. వాళ్ల ఫ్యాన్‌లు సోలార్ ఎనర్జీ తో మెల్ల గా నడుస్తాయి. నాకు చాలా ఉక్కగా ఉంది అని అంటే, వేడి అంటే ఏమిటి? పడుకోవడానికి అది ఎందుకు అడ్డమొస్తుంది అన్నాడు. రూంలోని ఫ్యాన్ ను పూర్తిగా నావైపు తిప్పి నిద్రపోయా డు. ఉదయం నాలుగున్నరకు లేచి మేం పత్రికలలో ప్రకటించడానికి తయారుచేసిన రెండు పేజీల ఇంగ్లిషు ప్రకటన ను ఉదయం ఆరు గంటల వరకు హిందీలోకి ముత్యాల్లాంటి అక్షరాలతో రాసి చాలా సంతృప్తిగా నాకు చూపించాడు. బీడీ శర్మ ఇలాంటి ఏ సౌకర్యాలను ఆశించలేదు కాబట్టే ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ లాంటి ప్రధానమంవూతులతో నిస్సంకోచంగా మాట్లాడారు. ఆదివాసీ సమస్యల గురించి వాళ్లను ఎడ్యుకేట్ చేయడానికి వెనకాడలేదు. ఇందిరాగాంధీకి శర్మ గారంటే ఒక ప్రత్యేక గౌరవం కూడా. ఈశాన్య భారతంలోని నెహ్రూ విశ్వవిద్యాలయంలో వీసీని చంపేయడం వలన, విశ్వవిద్యాలయ వీసీగా వెళ్లడానికి ఎవరూ సిద్ధంగా లేనప్పుడు బీడీ శర్మ గారిని వీసీ పదవికి ఆమె పంపింది. ఆయన ఐదు సంవత్సరాలు రాత్రింబవళ్లు కష్టపడి విశ్వవిద్యాలయాన్ని దారిలోకి తెచ్చారు. ఆ తర్వాత ఆయనను ఎస్‌సీ, ఎస్‌టీ జాతీయ కమిషన్‌కు చైర్మన్‌గా నియమించారు. ఇందిరాగాంధీ అకస్మాత్తుగా మరణించడంతో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. బీడీ శర్మ రాజీవ్‌గాంధీని కలిసినప్పుడు రాజ్యాంగంలో మీ హోదా ఏమిటి అని అడిగితే, మీ ప్రపంచంలో, మీ విలువల చట్రంలో మనిషి హోదాను డబ్బులతో కొలుస్తారు. నేను కేవలం నెలకు ఒక రూపాయి తీసుకుంటున్నాను. అలా చూస్తే నాకు ఏ హోదా లేదు. అయితే నేను ఎవరికి అమ్ముడుపోయే వ్యక్తిని కాదు అని అన్నప్పుడు, రాజీవ్‌గాంధీ లేచి నిలబడి తనను డోర్ దాక వచ్చి సాగనంపాడు. ఇది బీడీ శర్మ విశిష్ట వ్యక్తిత్వం. నేడు హోదా, అంతస్తు, అధికారం, అవినీతిలో కూరుకుపోయిన పాలనాయంవూతాంగానికి బీడీ శర్మ జీవిత విధానం ఎలా కనిపిస్తుందో మనకు తెలియ దు. కాని తెలంగాణ ఉద్యమ కారులకు ఈ నిజాయితీ, నిబద్ధత నిరాడంబరత స్ఫూర్తి కావాలి. ఆయన ఆచరణ ఒక ప్రమాణం కావాలి.

No comments:

Post a Comment